విజయం.. స్వర్ణాక్షరాల లిఖితం
భారత పెట్రోలియం, శక్తి సంస్థ (ఐఐపీఈ) ఏర్పడ్డాక శుక్రవారం తొలిస్నాతకోత్సవం నిర్వహించుకుంటోంది. 2016-20, 2017-21 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పట్టాలందు కోబోతున్నారు.
ఐఐపీఈలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు
న్యూస్టుడే, ఏయూ ప్రాంగణం
ఇష్టమైన కోర్సుల్లో చేరితే..
మన భవిష్యత్తును మనమే తీర్చుదిద్దుకోవచ్చు..
చక్కటి ‘బంగరు’ బాటలు వేసుకోవచ్చు. దీన్ని ఆచరించి చూపించారు.. కొందరు ఐఐపీఈ విద్యార్థులు. తాము నేర్చుకున్న కోర్సుల్లో అగ్రగ్రాములుగా నిలిచి.. అందులో బంగారు పతకాలు సాధించి.. స్నాతకోత్సవ వేళ నేడు వాటిని అందుకోనున్నారు.
భారత పెట్రోలియం, శక్తి సంస్థ (ఐఐపీఈ) ఏర్పడ్డాక శుక్రవారం తొలిస్నాతకోత్సవం నిర్వహించుకుంటోంది. 2016-20, 2017-21 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పట్టాలందు కోబోతున్నారు.
అంతేకాదు.. ఈ కోర్సుల్లో ఆరుగురు విద్యార్థులు అగ్రగాములుగా నిలిచి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. వారిలో నలుగురు విద్యార్థులు మన రాష్ట్రం వారు కాగా.. ముగ్గురు విశాఖ వాసులు కావడం విశేషం. ఈ సందర్భంగా వారు ‘న్యూస్టుడే’తో మాట్లాడారు.
చిన్నప్పటి నుంచే...
మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. మా ప్రాంతంలో ఒ.ఎన్.జి.సి ఉంది. చిన్నతనం నుంచి పెట్రోల్ రిఫైనరీ చూస్తూ పెరిగాను. అప్పటి నుంచే అందులో పనిచేయాలని కోరిక కలిగింది. జె.ఇ.ఇ. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ వచ్చింది. థన్బాద్ ఐఐపీఈలో చేరాలనుకున్నాను. అక్కడ సీటు రాలేదు. 2017-21 బ్యాచ్లో విశాఖపట్నం ఐఐపీఈలో పెట్రోలియం ఇంజినీరింగ్లో సీటు వచ్చింది. ఐఐటీ ఖరగ్పూర్ మెంటార్ కావడంతో ఇక్కడ చేరాను. ‘ఈనాడు’ దినపత్రికలో వచ్చిన వార్త చదివాక నాకు గోల్డ్ మెడల్ వచ్చినట్లు తెలిసింది. చాలా అనందంగా ఉంది. నేను ఇప్పుడు ఆయిల్ ఇండియా లిమిటెడ్లో పనిచేస్తున్నాను.
- దంగేటి శ్రీకార్తీక్ (2017-21)
పుట్టి పెరిగిన ఊరిలోనే చదువు, ఉద్యోగం...!
మాది పెదవాల్తేరు. విశాఖలోనే నా చదువంతా సాగింది. ప్రస్తుతం కెమికల్ ఇంజినీరింగ్కు మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకున్నాను. నాకు గోల్డ్మెడల్ వస్తుందని భావించలేదు. ఐఐపీఈ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. కొత్తగా చేరే విద్యార్థులు బాగా కష్టపడాలి. నేను ప్రస్తుతం విశాఖలోని మల్కాపురం హెచ్.పి.సి.ఎల్.లో ఆపరేషన్స్ ఇంజినీర్గా పనిచేస్తున్నాను.
-భమిడిపాటి సాయి హర్ష (2016-20)
పెద్ద కంపెనీల భాగస్వామ్యం ఉంది...
విశాఖపట్నం ఐఐపీఈలో పెద్ద పెద్ద కంపెనీలకు భాగస్వామ్యం ఉంది. ఇందులో చేరిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యంతా కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్, పెట్రోలియం ఇంజినీరింగ్పైనే ఆధార పడుతుంది. జె.ఇ.ఇ.లో మంచి ర్యాంకు రావడంతో సొంత ఊరులోనే చదువుకోవాలనుకున్నాను. నాకు ఇష్టమైన పెట్రోలియం ఇంజినీరింగ్లో సీటు వచ్చింది. తొలినుంచి ఇనిస్టిట్యూట్లో టాపర్గా ఉండడంతో బంగారు పతకం తప్పకుండా వస్తుందని భావించాను.
- కందాళ విశ్వకాంత్ (2016-20)
కష్టపడిత చదివితేనే భవిష్యత్తు
మాది గాజువాక. మా నాన్న పెట్రోల్ బంక్ నడుపుతున్నారు. దీంతో పెట్రోల్కు సంబంధించిన కోర్సు చదవాలని చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేది. జె.ఇ.ఇ.లో మంచి ర్యాంకు రావడంతో ఎక్కడ పెట్రోల్కు సంబంధించిన కోర్సులు ఉన్నాయో వెతికాను. విశాఖలోనే ఐఐపీఈ ఉందని, ఐఐటీ ఖరగ్పూర్ మెంటార్ అని తెలుసుకొని చేరాను. బంగారు పతకం వచ్చినట్లు గురువారమే నాకు విషయం తెలిసింది. విద్యార్థులు కష్టించి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతాను. ప్రస్తుతం బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్నాను.
-కొనల రేష్మారెడ్డి (2017-21)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం