logo

చంద్రబాబు, లోకేశ్‌ కోలుకోవాలని పూజలు

తెదేపా అగ్రనేతలు నారా చంద్రబాబునాయుడు, లోకేశ్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో గురువారం నాయకులు పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం

Published : 21 Jan 2022 04:34 IST


నూకాలమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న బుద్ద, తెదేపా నాయకులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: తెదేపా అగ్రనేతలు నారా చంద్రబాబునాయుడు, లోకేశ్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో గురువారం నాయకులు పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం తెదేపా అధ్యక్షులు బుద్ద నాగజగదీశ్వరరావు ఆధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ద మాట్లాడుతూ చంద్రబాబు అన్నివర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నారన్నారు. ఆయన పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. తెదేపా నాయకులు ఉగ్గిన రమణమూర్తి, బొలిశెట్టి శ్రీనివాసరావు, కడిమ్మిశెట్టి నరసింగరావు, పోతల రమణమ్మ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని