logo

వ్యాన్‌ ఢీ: కూలీ దుర్మరణం

శ్రీరాంపురం కూడలిలో వ్యాన్‌ ఢీకొని వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం.. ఎస్‌.నర్సాపురానికి చెందిన గొర్ల శ్రీను (41), గోవింద్‌

Published : 22 Jan 2022 02:15 IST

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీరాంపురం కూడలిలో వ్యాన్‌ ఢీకొని వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం.. ఎస్‌.నర్సాపురానికి చెందిన గొర్ల శ్రీను (41), గోవింద్‌ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వ్యాను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని తుని ఆసుపత్రికి తరలిస్తుండగా శ్రీను మృతి చెందగా, గోవింద్‌ చికిత్స పొందుతున్నాడన్నారు. వ్యాన్‌ డ్రైవరు అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఎస్సై చెప్పారు.


గుర్తుతెలియని ఒకరి మృతి

తుని పట్టణం, న్యూస్‌టుడే: తుని రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పాయకరావుపేట నాగరాజుపేట గేటు వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని ఒకరు (40) మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై అబ్దుల్‌ మారూఫ్‌ తెలిపారు. ప్రమాదంలో మృతదేహం ఛిద్రమైందని, మృతుని వివరాలు తెలియరాలేదన్నారు. ఎడమ చేతిపై అమ్మానాన్న అని పచ్చబొట్టు ఉందని, మరిన్ని వివరాలకు రైల్వేపోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో భద్రపరిచామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని