logo

ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ.79లక్షలు

సంక్రాంతి పండగ సందర్భంగా ఆర్టీసీ నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా రూ.79లక్షల ఆదాయం లభించింది. విశాఖజోన్‌ నుంచి మొత్తం 460 బస్సులను 2.02లక్షల

Published : 22 Jan 2022 02:48 IST

జగదాంబకూడలి, కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ సందర్భంగా ఆర్టీసీ నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా రూ.79లక్షల ఆదాయం లభించింది. విశాఖజోన్‌ నుంచి మొత్తం 460 బస్సులను 2.02లక్షల కిలోమీటర్లు అదనంగా నడిపారు. విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్‌కు నడిపిన సర్వీసులు మినహా మిగతా ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలు వసూలు చేశారు. విశాఖపట్నం డిపోతోపాటు మధురవాడ, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, కూర్మన్నపాలెం, గాజువాక, సింహాచలం, వాల్తేరు, మద్దిలపాలెం డిపోల నుంచి బస్సులను నడిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని