వినూత్న ఆలోచన.. అద్భుత ఆవిష్కరణ
మదిలో మెదిలిన వినూత్న ఆలోచనలకు రూపమిస్తూ అద్భుత ఆవిష్కరణ చేసి తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. జాతీయ స్థాయిలో విజయాలు అందుకుంటూ తమ ప్రతిభను నిరూపిస్తున్నారు మధురవాడ
అటల్ స్పేస్ ఛాలెంజ్ విజేతలుగా గురుకులం విద్యార్థినులు
జాతీయ స్థాయిలో సత్తాచాటిన‘ధావన్ స్పేస్ రోవర్’ నమూనా
కొమ్మాది, న్యూస్టుడే
మదిలో మెదిలిన వినూత్న ఆలోచనలకు రూపమిస్తూ అద్భుత ఆవిష్కరణ చేసి తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. జాతీయ స్థాయిలో విజయాలు అందుకుంటూ తమ ప్రతిభను నిరూపిస్తున్నారు మధురవాడ రిక్షా కాలనీలోని బాలయోగి గురుకుల ప్రతిభ పాఠశాల విద్యార్థినులు. ‘ఉమెన్ సేఫ్టీ డివైజ్’ను తయారు చేసి ‘అటల్ ఇన్నోవేషన్ మారథాన్’కు ఎంపికైన కొద్దిరోజుల్లోనే ‘ధావన్ స్పేస్ రోవర్’ పరికరాన్ని ఆవిష్కరించి జాతీయ స్థాయిలో ఖ్యాతి పొంది ‘అటల్ స్పేస్ ఛాలెంజ్’ విజేతలుగా నిలిచారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో..
అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఉపగ్రహ సైన్స్, సాంకేతికత విభాగంలో నీతి ఆయోగ్, ఇస్రో, సీబీఎస్ఈ సంయుక్తంగా గతేడాది అక్టోబరు(4 తేది నుంచి 10 వరకు) నెలలో ‘వరల్డ్ స్పేస్ వీక్-2021’ పేరిట జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. అంతరిక్షంలో మనుషులు ఎదుర్కోనున్న సవాళ్లు, పరిష్కారాలను అన్వేషించడం ఇతివృత్తంగా పాఠశాల స్థాయిలో చేపట్టిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 6,500 మంది విద్యార్థులు పాల్గొని 2,500 నమూనాలతో ఆన్లైన్లో పోటీపడ్డారు. ఇందులో ఉత్తమమైన 75 నమూనాలను ఎంపిక చేశారు. వీటిలో ఏపీ నుంచి మూడు ప్రాజెక్టులు ఎంపికకాగా అందులో మధురవాడ గురుకులంలో 8, 9 తరగతులకు చెందిన ఎం.ఊర్మిళ, వై.జెస్సికా, ఆర్.అరుంధతి తయారు చేసిన ‘ధావన్ స్పేస్ రోవర్’ పరికరం ప్రథమ స్థానంలో నిలిచింది. గైడ్ ఉపాధ్యాయుడు టి.రాంబాబు సారధ్యంలో ఈ పరికరాన్ని రూపొందించి జాతీయ స్థాయిలో మెరిశారు. త్వరలో నీతి ఆయోగ్ నిర్వాహకులు ముగ్గురు విద్యార్థినులకు అతిథుల చేతులమీదుగా బహుమతులు అందించనున్నారు.
అంతరిక్షంలో ప్రయాణించేలా..
అంతరిక్షంలోని గ్రహాల్లో ప్రయాణించేలా ‘ధావన్ స్పేస్ రోవర్’ పరికరానికి రూపకల్పన చేశారు. 6డీసీ మోటార్లు, ఎల్298 మాడ్యూల్, ఆర్డినోబోర్డ్, ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్, బ్యాటరీలతో రాకర్స్ను అనుసంధానించారు. ఎత్తుపల్లాలపై సులభంగా ప్రయాణించి, అక్కడ ఉన్న సమాచారాన్ని శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మొబైల్కి sppbluetooth యాప్ను అనుసంధానిస్తూ పరికరాన్ని ఓ నమూనాగా రూపకల్పన చేశారు. విద్యార్థినులు రూపొందించిన పరికరానికి గుర్తింపు రావడంతో విద్యార్థినులతో పాటు గైడ్ ఉపాధ్యాయుడు టి.రాంబాబును గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి హర్షవర్థన్, సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత, గురుకులాల సమన్వయకర్త ఎస్.రూపావతి, ప్రిన్సిపల్ ఎస్.వి.రమణ, వైస్ ప్రిన్సిపల్ రామ్ప్రసాద్ అభినందించారు.
విజేతలకు అభినందిస్తున్న గురుకుల విద్యాలయం నిర్వాహకులు
ఏటీఎల్ సహకారంతో..
నూతన ఆవిష్కరణల రూపకల్పనే లక్ష్యంగా ఏర్పాటైన అటల్ టింకరింగ్ ల్యాబ్(ఏటీఎల్) సహకారంతో సైన్సు ఉపాధ్యాయులు రాంబాబు నేతృత్వంలో ధావన్ స్పేస్ రోవర్ నమూనాను మేం తయారు చేశాం. దీనికి జాతీయ స్థాయిలో చోటు దక్కించుకోవడం మాలో మరింత స్ఫూర్తిని కలిగించింది. పరిశోధనల వైపు గురుకులం ప్రోత్సహించడంతోనే సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాం.
- ఊర్మిళ, 8వ విద్యార్థిని
పరిశోధనలవైపు ఆసక్తి పెంచేలా..
విద్యార్థుల్లో దాగిఉన్న ప్రజ్ఞను పసిగట్టి వాటిలో తర్ఫీదు ఇవ్వడం, పదునుపెట్టడం వల్ల వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. విభిన్న పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్నాం. ఏటీఎల్ సహకారంతో పరిశోధనల వైపు ఆసక్తి పెంచి నూతన ఆవిష్కరణలు చేపట్టేలా కృషి చేస్తున్నాం. 75 నమూనాల్లో ధావన్ స్పేస్ రోవర్ నమూనాను నీతి ఆయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ నిర్వాహకులు ట్విట్టర్లో పెట్టి ప్రశంసించడం గర్వించదగ్గ విషయం.
- టి.రాంబాబు, ఏటీఎల్ ల్యాబ్ ఇన్చార్జ్, ఏపీ బాలయోగి గురుకులం, మధురవాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!
[ 23-04-2024]
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం. -
అట్టహాసంగా శ్రీభరత్ నామినేషన్
[ 23-04-2024]
తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్ సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
దిగజారిన స్థానం!!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
వంచన మాటలు.. పింఛన్లపై తూటాలు!!
[ 23-04-2024]
పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్ అవ్వాతాతలను వంచించారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని బూటకపు మాటలతో మోసం చేశారు. -
మెరుపుల ప్రచారం
[ 23-04-2024]
దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్కు చెందిన పలు ప్రచార వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తున్నాయి. -
తెదేపాలోకి వలసల వరద
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉన్న సమయంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు. -
కూటమి మోగిస్తుంది విజయ దుందుభి
[ 23-04-2024]
తెదేపా కూటమి జిల్లాలో విజయం సాధించడం ఖాయమని నేతలు పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో ఆగని అఘాయిత్యాలు
[ 23-04-2024]
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ సోమవారం నామపత్రం దాఖలు చేశారు. -
కలెక్టరేట్లోకి వెళ్లకుండా వెలగపూడి అడ్డగింత
[ 23-04-2024]
తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ నామపత్రాల దాఖలు సందర్భంగా కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. -
రసాభాసగా మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం
[ 23-04-2024]
సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. -
మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు
[ 23-04-2024]
కార్మిక శాఖ ఎ.పి. దుకాణాలు, సంస్థల చట్టం-1988 ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరిగే మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆదూరు గణేశన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
కూటమి విజయంతోనే అభివృద్ధి
[ 23-04-2024]
కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పెందుర్తి మండలం విద్యార్థులు సత్తాచాటారు. -
ముగిసిన హస్తకళలపై శిక్షణ
[ 23-04-2024]
పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్స్కూల్లోని విద్యార్థులకు మూడు రోజుల నుంచి జరుగుతున్న హస్తకళలపై శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. -
అధ్యాపకుల సేవలు అభినందనీయం
[ 23-04-2024]
సబ్బవరం గురుకుల కళాశాలలో ఎక్కువ కాలం పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాకులు జాన అప్పారావు, బద్రికూర్మారావుల సేవలు చిరస్మరణీయమని జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి అన్నారు. -
ఏడు నియోజకవర్గాలకు 22 నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
గడువు తేదీ సమీపిస్తుండడంతో నామపత్రాల దాఖలు ప్రక్రియ వేగం పుంజుకుంది. -
ఇంటి నుంచి ఓటుకు 26 వరకు గడువు
[ 23-04-2024]
ఇంటి నుంచి ఓటు కోసం వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకొనే గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇద్దరు యువకులను బలిగొన్న 108 అంబులెన్స్
[ 23-04-2024]
ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామీ గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్