పేదలైనా.. రూ. లక్షలు కట్టాల్సిందే!
ఆక్రమిత స్థలాల క్రమబద్థీకరణకు ఉద్దేశించిన జీవో నెంబరు-225 అమలు అధికారులకు కత్తిమీద సాములా మారగా...పేదలకు మాత్రం ఊహించని భారంగా మారిందంటున్నారు. 75 చదరపు గజాల వరకే
ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు నోటీసులు
అందులో విలువ చూసి బెంబేలెత్తుతున్న ప్రజలు
న్యూస్టుడే, ఎంవీపీకాలనీ, విశాలాక్షినగర్, వేపగుంట, న్యూస్టుడే, గాజువాక: ఆక్రమిత స్థలాల క్రమబద్థీకరణకు ఉద్దేశించిన జీవో నెంబరు-225 అమలు అధికారులకు కత్తిమీద సాములా మారగా...పేదలకు మాత్రం ఊహించని భారంగా మారిందంటున్నారు. 75 చదరపు గజాల వరకే ఉచితంగా క్రమబద్థీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆపై ఒక్క చ.గ. అదనంగా ఉన్నా మొత్తం స్థలానికి నిర్దేశిత ధర కట్టాల్సిందేనంటూ డిమాండు నోటీసుల్లో పేర్కొంటోంది. దీంతో ‘మాకొద్దు బాబోయ్.’ అంటూ పలువురు లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. 2019 రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం 75 నుంచి 150 గజాల లోపు వారు స్థలం మూలవిలువలో 75శాతం, 150 నుంచి 300 గజాల వరకు శతశాతం రిజిస్ట్రేషన్కు చెల్లించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* అర్హులైన లబ్దిదారులకు నివాస స్థలం క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ మొత్తం విలువతో సహా రెవెన్యూ అధికారులునోటీసులు జారీ చేశారు. వాటిని చూసి లబ్ధిదారులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో ఓ ప్రాంతంలో 130 చ.గ. స్థలం క్రమబద్ధీకరణకు రూ.65వేలు చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుతం రూ.18లక్షలు చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని చోట్ల 75 చ.గ. స్థలంలో నివాసముంటున్న వారికి కూడా రూ.10.12లక్షల మేర చెల్లించాలంటూ నోటీసులు రావటం విశేషం. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేయడానికి ముందే ఎంత నగదు చెల్లించాల్సి ఉంటుందనేది తెలియజేసి ఉంటే దరఖాస్తు చేయాలా వద్దా అనేది నిర్ణయించుకునేవారమని పలువురు పేర్కొంటున్నారు.
పెందుర్తి మండల పరిధిలో.. సుమారు 700మంది అభ్యంతరంలేని స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నామని దరఖాస్తు చేసుకున్నారు. 225మంది క్రమబద్ధీకరణకు అర్హులని తేలారు. 92మంది వరకు 75గజాల లోపు స్థలాల్లో ఉన్నారు. ఇక మిగిలిన వారందరికీ నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం గజం ధర రూ. 15 వేల నుంచి 40వేల వరకు ఉంది. దీనిని బట్టి ఆయా ప్రాంతాల్లో అర్హులు రూ. 15 లక్షల నుంచి 60 లక్షల వరకు చెల్లిస్తే క్రమబద్ధీకరణ సాధ్యమవుతుంది. ‘నోటీసులు అందుకున్న రెండునెలల్లోగా క్రమబద్ధీకరించుకోవాలి. ప్రస్తుతానికి ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. సచివాలయ ఉద్యోగులతో సమాచారాన్ని చేరవేస్తున్నాం’ అని పెందుర్తి తహసీల్దార్ రామారావు పేర్కొన్నారు.
* విశాఖ తూర్పు నియోజకవర్గంలో.. సుమారు 1,733 మంది దరఖాస్తు చేయగా, వారిలో 765 మంది దరఖాస్తులు క్రమబద్ధీకరణకు అర్హత సాధించాయి.
* గాజువాక మండలంలో.. 75 చ.గ. స్థలాల్లో ఉన్న 47 మంది జీవోను వినియోగించుకోవడానికి డిమాండు నోటీసులు తీసుకుంటున్నారు. 75- 150 చ.గ.ల్లోపు 19మంది, 150-300 చ.గ.ల్లోపు ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. నోటీసులు ఇవ్వడానికి అధికారులు వెళ్తే ‘ఇంత భారంతో కూడిన క్రమబద్ధీకరణ మాకొద్దం’టూ వెనకడుగు వేయడంతో అవాక్కవుతున్నారు. 75 చ.గ.ల్లోపు వారే నోటీసులు తీసుకుంటున్నారని, పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించామని డిప్యూటీ తహసీల్దార్ భారతి తెలిపారు.
రూ.18 లక్షలు చెల్లించాలన్నారు..
చినగదిలిలో 130 చ.గ. స్థలం క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేయగా.. రూ.18లక్షల మేర చెల్లించాలంటూ నోటీసులు అందజేశారు. మా ప్రాంతంలో ఒకరికైతే రూ.44 లక్షలు, మరొకరికి రూ.24లక్షలు చొప్పున చెల్లించాలంటూ నోటీసులు అందజేశారు. ఇంత మొత్తం ఎలా కట్టాలో తెలియని పరిస్ధితి.
-కొండలరావు, చినగదిలి
సంతోషం ఆవిరవుతోంది..: మేం పెందుర్తి కుమ్మర కాలనీలో ఉంటున్నాం. సుమారు 20 ఏళ్ల క్రితం 300గజాల్లో ఇల్లు నిర్మించుకున్నాం. క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడంతో సంతోషించాం. నోటీసుల్లో పేర్కొన్న అంకెలు చూసి కలవరపడ్డాం. నా భర్త కూలిపని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం మా స్థలాన్ని క్రమబద్ధీకరించుకోవాలంటే సుమారు రూ.60లక్షలు చెల్లించాల్సి ఉంది. అంత మొత్తం చెల్లించే వారమైతే మేం పేదలం ఎలా అవుతామన్నది ప్రభుత్వం గ్రహించి మా బాధలు ఆలకించాలి.
-చెల్లయ్యమ్మ, పెందుర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ