రైతు దగా ప్రభుత్వం
‘ఈ-క్రాప్ నిబంధనల పేరుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది రైతు దగా ప్రభుత్వమ’ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో ఓ....
అయ్యన్న ధ్వజం
రైతులతో మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు
కృష్ణదేవిపేట, న్యూస్టుడే: ‘ఈ-క్రాప్ నిబంధనల పేరుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది రైతు దగా ప్రభుత్వమ’ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శనివారం వచ్చిన అయ్యన్న నాలుగు గ్రామాలకు చెందిన రైతులతో మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొంటామన్న అధికారులు ఈ-క్రాప్ పేరుతో ఆంక్షలు పెట్టడమేంటని ప్రశ్నించారు. నాతవరం మండలం గునిపూడిలో 800 మంది రైతులు నమోదు చేస్తే.. 500 మంది నుంచే ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన రైతుల పేర్లు ఏమయ్యాయని అడిగితే వారి నుంచి సమాధానం లేదని పేర్కొన్నారు. తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలను మూసేసి.. గోవాడ కర్మాగారానికి చెరకు తరలించమంటున్న అధికారులు.. రైతుపై రవాణా ఛార్జీల భారం ఏమేర పడుతుందో ఆలోచించడం లేదని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్