వాటా ఇచ్చేయ్.. లూటీ చేసేయ్!
బంధువుల పేరున కొనిపించిన క్వారీని తానే పక్క క్వారీ నిర్వాహకునికి భారీ మొత్తానికి అమ్మేశారని.. ఈ వ్యవహారంలోనే కుటుంబ సభ్యుల మధ్య డబ్బుల పంపకంలో తేడా రావడంతో ఆడియోటేపులు బయటపడినట్లు మైనింగ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే కాకుండా మరికొన్ని క్వారీలను మధ్యవర్తిగా సన్నిహితులకు అప్పగించడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
అధికారుల అండ దండలతోనే అక్రమ రవాణా
అధికార క్వారీలు కొన్నే అనధికార క్వారీలు ఎన్నో..
సర్కారు ఆదాయానికి భారీగా గండి..
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, న్యూస్టుడే నిఘా బృందం
ప్రతి పనికీ ఓ లెక్కుంటుంది.. ఓ పద్ధతీ ఉంటుంది. మరి అధికారం అండ ఉన్నవాడికి నిబంధనలు అడ్డేరావు.. హెచ్చరికలు అస్సలు పట్టవు.. ఆపై అధికారులు కుమ్మక్కయి.. లోపాయికారి ఒప్పందాలు చేసుకుని అడ్డగోలుగా గనులను లూటీచేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
రూ.వేలు.. రూ.లక్షల్లో కాదు.. రూ.కోట్లలో ఎగనామం పెడుతున్నారు. కంచే చేను మేసిన విధంగా అధికారులు వ్యవహరించడంతోనే అక్రమ క్వారీ తవ్వకాలు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లుతున్నాయి.
అనకాపల్లిలో క్వారీ
జిల్లాలో 128.69 హెక్టార్లలో పెద్దతరహా ఖనిజాల లీజులు 14 వరకు ఉన్నాయి.
చిన్నతరహా ఖనిజాల లీజులు 1277.02 హెక్టార్లలో ఉన్నాయి. 485 మంది వీటిని నిర్వహిస్తున్నారు.
అనుమతులు ఇవ్వడం లేదని అడ్డదారుల్లో..
అనకాపల్లి గనుల శాఖ ఏడీ కార్యాలయం పరిధిలో 344 క్వారీలు ఉండగా వీటిలో 76 క్వారీలకే అనుమతులున్నాయి. కొత్తగా అనుమతులు తెచ్చుకోవాలన్నా. పాత వాటిని పునరుద్ధరించుకోవాలన్నా రాబోయే పదేళ్లకు ఎంత మేర తవ్వకం చేస్తామో తెలిపేలా మైనింగ్ ప్లాన్తో పాటుగా ఈసీ (పర్యావరణ అనుమతులు), కాలుష్య ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. అయిదు హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే గ్రామ సభ నిర్వహించాలి. అన్నీ వచ్చినా ఈసీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అనుమతులు తెచ్చుకోవడం కొంతమందికి తలకు మించి భారంగా మారడంతో అక్రమ రవాణాపై దృష్టి పెడుతున్నారు. బిల్లులు లేకుండా యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఇటీవల అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళలో తనిఖీ చేసిన పోలీసులు 25కి పైగా బిల్లుల్లేని క్వారీ వాహనాలను సీజ్ చేశారు. అయితే అధికారుల కళ్లుగప్పి తిరుగుతున్న వాహనాలు ఎన్నో ఉన్నాయి. పోలీసు, గనుల శాఖ అధికారుల సహకారంతో అక్రమ రవాణా చేస్తున్నవారు ఉన్నారు.
అధికలోడుతో వాహనాల రాకపోకలతో దెబ్బతిన్న రోలుగుంట మండలంలోని ఓ రహదారి
ఒక్క వే-బిల్లుపైనే అన్నీ..
* రోలుగుంట సహా చుట్టుపక్కల పలు గ్రామాల్లో వందమందికిపైగా ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారు. వీరంతా కలిసి కొద్దిరోజుల క్రితం క్వారీల యాజమానుల దగ్గరకి వెళ్లి ప్రతి లోడుకు వే బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ట్రాక్టర్లు కదలవని భీష్మించారు. ఆ తర్వాత ఇరు వర్గాలకు చెందిన ప్రతినిధులు కూర్చుని మాట్లాడుకున్నారు. ఏం నిర్ణయించుకున్నారో బయటకు పొక్కలేదు గానీ యథావిధిగా రవాణా మొదలైంది. ఒక వే-బిల్లుమీద వందల లోడ్లు వెళ్లిపోతున్నాయి.
* నర్సీపట్నం పురపాలికలోని బలిఘట్టం, బయ్యపురెడ్డిపాలెం కొండల్లో నిత్యం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అయినవారి అండతో ఇక్కడ నిర్భయంగా తవ్వకాలు సాగుతున్నాయి. రాత్రివేళ జేసీబీలు వినియోగించి మరీ తవ్వేస్తున్నారు.
* రోలుగుంట మండలంలో పది క్వారీలు ఉన్నాయి. ఒక క్వారీలో పేలుడు పదార్థాలు ఉపయోగించేందుకు అనుమతి తీసుకుని దాంతో పాటుగా మరి కొన్ని క్వారీల్లోనూ పేల్లుళ్లకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం నర్సీపట్నం నుంచి రోలుగుంట బైకుపై వెళుతున్న ఇద్దరు యువకులకు క్వారీలో పేలిన రాళ్లు బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.
ఇటీవల పోలీసులు సీజ్ చేసిన క్వారీ వాహనాలు
దాడులు చేయిస్తున్నాం..
అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రించడానికి అందుబాటులో ఉన్న సిబ్బందితో దాడులు చేయిస్తున్నాం. ఫిర్యాదు వచ్చిన వెంటనే క్వారీలను పరిశీలించి అక్రమాలుంటే గుర్తించి జరిమానాలు వేస్తున్నాం. గతంలో జరిమానాలు వేసినవారిలో చాలామంది కోర్డును ఆశ్రయించడంతోనే వసూళ్లు తక్కువగా ఉన్నాయి. ఈసీ అనుమతుల జాప్యంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.
- డీవీఎస్ రాజు, ఇన్ఛార్జి డీడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!