logo

విధుల్లో నిర్లక్ష్యం.. కానిస్టేబుల్‌ బదిలీ

రాజయ్యపేట అత్యాచార ఘటనపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నక్కపల్లి పోలీసుస్టేషన్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావుపై బదిలీ వేటు పడింది.

Published : 23 Jan 2022 04:22 IST

విశాఖ గ్రామీణం, న్యూస్‌టుడే: రాజయ్యపేట అత్యాచార ఘటనపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నక్కపల్లి పోలీసుస్టేషన్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావుపై బదిలీ వేటు పడింది. బాధితురాలితో కలిసి తల్లిదండ్రులు ఘటన జరిగిన రోజు రాత్రి స్టేషన్‌కు వస్తే విధుల్లో ఉన్న శ్రీనివాసరావు మరుసటి ఉదయం రావాలని చెప్పి వెనక్కు పంపాడని బాధితులు వాపోయారు. ఈ విషయం పత్రికల్లో రావడంపై స్పందించిన ఎస్పీ కృష్ణారావు కానిస్టేబుల్‌ను చింతపల్లి స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇదొక్కటి మినహాయిస్తే మిగిలిన విషయాల్లో పోలీసుల పనితీరు బాగుందని ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారని సీఐ నారాయణరావు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా.. చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని