వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వస్తున్న బైకు బలంగా ఢీకొట్టడంతో అక్కడిక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే: ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వస్తున్న బైకు బలంగా ఢీకొట్టడంతో అక్కడిక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నర్సీపట్నం - గబ్బాడ మార్గంలో నెల్లిమెట్ట సమీపంలో శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పీనారిపాలెం కూడలిలో ఓ చికెన్ సెంటర్లో సహాయకుడిగా పనిచేస్తున్న అయ్యన్నకాలనీకి చెందిన కోరుకోండ సురేష్ (19) స్నేహితుడుతో కలిసి బుచ్చంపేట వైపు నుంచి బైకుపై నర్సీపట్నం వస్తున్నారు. ఎలమంచిలి మండలం పులపర్తికి చెందిన పి.సత్యనారాయణ, అతని మేనల్లుడైన గొలుగొండ మండలం పాకలపాడుకు చెందిన అంజూరి శంకరరావు, రోలుగుంట మండలం రత్నంపేటకు చెందిన మహిళ వరలక్ష్మితో కలిసి నర్సీపట్నం నుంచి బైకుపై రత్నంపేట వెళ్తున్నారు. బైకులు ఢీకొనడంతో ఈ ముగ్గురు తీవ్రంగా గాయపడగా సురేష్ స్నేహితుడు శ్యాం స్వల్పంగా గాయపడ్డాడు. వారంతా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సురేష్ మృతదేహాన్ని అంబులెన్స్లో ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
అరకులోయ, న్యూస్టుడే: వ్యాన్ ఢీకొని ఒకరు మృతి చెందారు. అరకులోయ పోలీసుల వివరాల ప్రకారం.. అరకులోయలోని శరభగుడకు చెందిన కొర్రా రామరాజు(35) స్థానిక గిరిజన కళా గ్రామంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గిరిజన సంక్రాంతి సందర్భంగా మూడు రోజులు ఇంట్లోనే ఉన్నారు. శనివారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై సహచరుడు గెమ్మెలి శేషుగిరిరావు(41)తో బయలుదేరాడు. ఐదు నిమిషాల్లో కళా గ్రామానికి చేరుకుంటారనగా మార్గమధ్యంలో పెట్రోల్బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న వ్యాన్ వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రామరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన శేషుని చికిత్స నిమిత్తం అరకులోయ వైద్య కేంద్రానికి, అక్కడి నుంచి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
లారీ ఢీ: రైతు..
చోడవరం గ్రామీణం, న్యూస్టుడే: చోడవరం నుంచి గోవాడ వెళ్లే మార్గంలో సోమేశ్వరరావు బంగ్లా సమీపాన చెరకు లారీ ఢీకొన్న సంఘటనలో ఓ పాడి రైతు శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఎస్సై విభీషణరావు కథనం ప్రకారం.. గోవాడ గ్రామానికి చెందిన ఏడువాక కోటి అప్పారావు (56) తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తుండగా ముందు వెళ్తున్న వ్యాన్ని తప్పించబోయాడు. అదే సమయంలో చోడవరం నుంచి గోవాడ వైపు చెరకు లోడుతో వస్తున్న లారీ ఢీకొనడంతో తలకు బలమైన గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలో పడి ..
ఎస్.రాయవరం, న్యూస్టుడే: మద్యం మత్తులో కాలువలో పడి వంటమాస్టర్ మృతి చెందిన ఘటన మండలంలోని తిమ్మాపురంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపురంలో నివాసం ఉంటున్న మోటూరి శ్రీనివాసరావు(48) ఎలమంచిలి మండలం పులపర్తిలోని ఓ హోటల్లో వంటమాస్టరుగా పనిచేస్తున్నారు. గ్రామంలోని ఆదర్శ పాఠశాలకు సమీపంలో ఉన్న మురుగు కాలువలో పడి ఉండటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిబ్బందితో అక్కడకు చేరుకున్న ఎస్సై కాలువలో నుంచి శ్రీనివాసరావును బయటకు తీసి నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీనివాసరావు మృతిచెందాడని నిర్ధారించారు. మద్యం మత్తులో బహిర్భూమికి వెళ్తూ కాలువలో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అనకాపల్లి పట్టణం: జాతీయ రహదారి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. రహదారి పక్కన ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్