చిత్ర వార్తలు
విశాఖ రుషికొండ బీచ్ వద్ద సముద్రంలో స్కూబా డైవింగ్ విన్యాసాలు జరుగుతుంటాయి. అయితే కొందరు ఔత్సాహికులు స్కూబా డైవింగ్ చేస్తూ ఆ తీరంలో కనిపించే జెల్లీఫిష్ అందాలను సైతం తమ కెమెరాల్లో శనివారం బంధించారు.
శనివారం ఉదయం భారీగా కురిసిన మంచుకు సింహాచలంలోని కొండల నడుమ అద్భుత దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయి. గిరులను మంచుతెరలు మేఘాల్లా అల్లుకున్నాయి.
-న్యూస్టుడే, సింహాచలం
విగ్రహాల శుభ్రత ఆరంభం
విశాఖ సాగర తీరంలో దేశ నాయకుల విగ్రహాలపై నెలలు తరబడి దుమ్ముపేరుకుపోవడంతో... వాటిని చూసిన వారు...అది ఏ నేతదో వెంటనే పోల్చుకోలేకపోతున్నారు. పక్షుల రెట్టలు పడినా ఎవరూ పట్టించుకోకపోవడంతో విమర్శలూ వస్తున్నాయి. ఈ సమస్యను గుర్తించిన అధికారులు విగ్రహాలను శుభ్రం చేసే పనులు కొనసాగిస్తున్నారు.
- ఈనాడు, విశాఖపట్నం
కొండల నడుమ హిమసాగరంలా
విశాఖ పరిసరాల్లో దట్టమైన మంచు కురిసి ఆహ్లాదకర దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. శనివారం ఉదయం 8.30 గంటల వరకూ మంచుతెరలు వీడలేదు. రోడ్లపై కంటి ముందు రెండడుగుల దూరంలోని మనిషి కూడా కనిపించనంత పరిస్థితి ఏర్పడింది. పద్మనాభం, సింహాచలం, తదితర కొండ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో హిమసాగరంలా మారిన తీరు చూపరులను ఆకట్టుకుంది. మన్యంలో మాత్రమే కనిపించే అలాంటి దృశ్యాలు ఇక్కడా కనిపించడంతో ప్రకృతి ప్రేమికులు మైమరచిపోయారు.
- న్యూస్టుడే, పద్మనాభం, సింహాచలం
హార్బర్లో ఢీకొన్నా... ఏమీకాకుండా
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో బోట్లను నిలిపే సమయంలో ఒకదానికొకటి తగిలే క్రమంలో అవి దెబ్బతింటున్నాయి. దీంతో ఆ సమస్యనుంచి కొంతైనా బయటపడేందుకు ఓ బోటు నిర్వాహకులు దాని చుట్టూ ఇలా దాదాపు 60 టైర్లు కట్టారు.
-ఈనాడు, విశాఖపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
[ 28-03-2024]
నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. -
ఆ వర్గాలకుసీట్లేవి?
[ 28-03-2024]
ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు. -
ప్రలోభాలపై నిఘా... ఉల్లంఘనలపై కఠిన చర్యలు
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
ఉత్తరం నుంచి మూడోసారి..
[ 28-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
ఘనంగా రామ్చరణ్ జన్మదిన వేడుకలు
[ 28-03-2024]
అనకాపల్లి పట్టణంలో సినీహీరో రామ్చరణ్ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. -
రాష్ట్రాభివృద్ధికే కూటమి పొత్తులు
[ 28-03-2024]
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైకాపాను ఓడించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. -
జనసేనలోకి వైకాపా నేత మన్యాల శ్రీనివాస్
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
విమ్స్లో రోగి సహాయకులపైనే భారం
[ 28-03-2024]
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో నాలుగో తరగతి సిబ్బంది పనితీరుపై రోజురోజుకీ విమర్శలు అధిక మవుతున్నాయి. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. -
సంపులో పడి సెక్యూరిటీ గార్డు మృతి
[ 28-03-2024]
విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటనపై బుధవారం దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. -
డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్టు
[ 28-03-2024]
డీజిల్ స్మగ్లింగ్ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!