అకృత్యం... అమానుషం!!
విశాఖజిల్లాలో శుక్ర, శనివారం వెలుగులోకి వచ్చిన అత్యాచార ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. చిన్నారులను, సొంత కూతురిని కూడా వదలని తీరు కలవరపెడుతోంది.
భయాందోళన రేపుతున్న అత్యాచార ఘటనలు
విశాఖజిల్లాలో శుక్ర, శనివారం వెలుగులోకి వచ్చిన అత్యాచార ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. చిన్నారులను, సొంత కూతురిని కూడా వదలని తీరు కలవరపెడుతోంది.
కంటి రెప్పే కాటేసే...
విశాలాక్షినగర్, న్యూస్టుడే : రక్షణగా నిలవాల్సిన కన్నతండ్రే కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏడాది కాలంగా తండ్రి చేస్తున్న అకృత్యం భరించలేక ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. సభ్య సమాజం తలదించుకునే సంఘటన విశాఖ ఆరిలోవ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. దీనికి సంబంధించి ఆరిలోవ పోలీసులు శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తికి కిడ్నీలు పాడయ్యాయి. దీంతో భార్య కిడ్నీ దానం చేసింది. ఆ తర్వాత ఆమెకు ఆరోగ్యం క్షీణించడంతో పుట్టింటిలో ఉంటూ విశ్రాంతి తీసుకుంటోంది. తండ్రికి సేవ చేయడానికి తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె(15)ను తోడుగా ఉంచింది. సేవ చేసుకుంటూ చదువుకుంటున్న కుమార్తె మీద కన్నేసిన తండ్రి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది కాలంగా తండ్రి చేస్తున్న అకృత్యాన్ని భరించలేక పాఠశాల ఉపాధ్యాయినుల సహాయంతో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించింది. వారి సాయంతో ఆరిలోవ పోలీసులను సంప్రదించారు. తండ్రిపై కేసు నమోదు చేసిన స్థానికు పోలీసులు దిశా పోలీసులకు అప్పగించారు. దిశా ఏసీపీ ప్రేమ్కాజల్ బాలికను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాపులుప్పాడలో..
గ్రామీణ భీమిలి, న్యూస్టుడే : విశాఖ నాల్గోవార్డు పరిధిలోని కాపులుప్పాడలో అయిదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు(12) అత్యాచారానికి పాల్పడినట్లు భీమిలి సీఐ గంటా వెంకటరమణ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం బయట ఆడుకుంటున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి తన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని దిశ పోలీసుస్టేషన్ ఏసీపీ ప్రేమకాజల్ శనివారం సందర్శించారు. పాప తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆధారాలను సేకరించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని హోమ్కు పంపించారు.
రాజయ్యపేట ఘటనపై ఏఎస్పీ విచారణ
నక్కపల్లి, న్యూస్టుడే: రాజయ్యపేటలో పదకొండేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి వెళ్లిన ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారితో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి స్టేషన్కు చేరుకుని ఎఫ్.ఐ.ఆర్. పరిశీలించారు. కేసు దర్యాప్తులో భాగంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధితులు ఘటన జరిగిన రోజు రాత్రి స్టేషన్కు వచ్చినా సిబ్బంది సరిగా స్పందించలేదనే దానిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఐ నారాయణరావు, మహిళా ఎస్సై శిరీష పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం.. కానిస్టేబుల్ బదిలీ
విశాఖ గ్రామీణం, న్యూస్టుడే: రాజయ్యపేట అత్యాచార ఘటనపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నక్కపల్లి పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుపై బదిలీ వేటు పడింది. బాధితురాలితో కలిసి తల్లిదండ్రులు ఘటన జరిగిన రోజు రాత్రి స్టేషన్కు వస్తే విధుల్లో ఉన్న శ్రీనివాసరావు మరుసటి ఉదయం రావాలని చెప్పి వెనక్కు పంపాడని బాధితులు వాపోయారు. ఈ విషయం పత్రికల్లో రావడంపై స్పందించిన ఎస్పీ కృష్ణారావు కానిస్టేబుల్ను చింతపల్లి స్టేషన్కు బదిలీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం