logo

ప్రధానితో ముచ్చటించనున్న అమేయ

‘ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2021’ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 24న వర్చువల్‌ విధానంలో అవార్డులకు....

Updated : 23 Jan 2022 05:37 IST

 

ఈనాడు, విశాఖపట్నం: ‘ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2021’ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 24న వర్చువల్‌ విధానంలో అవార్డులకు ఎంపికైన వారితో మాట్లాడనున్నారు. విశాఖ నుంచి బాల పురస్కార్‌ అవార్డుకు నగరానికి చెందిన లగుడు అమేయ ఎంపికైన విషయం తెలిసిందే. ప్రధానమంత్రితో ఆ బాలిక ముఖాముఖీ మాట్లాడనుంది. కార్యక్రమంలో భాగంగా అవార్డులకు ఎంపికైన వారికి ఇచ్చే పత్రాలను వర్చువల్‌గా ప్రధాని అందించనున్నారు. ఆ మేరకు సమాచారం అందినట్లు అమేయ తండ్రి మూర్తులు ‘ఈనాడు’కు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని