logo

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో ప్రతీ పౌరుడు భాగస్వాములు కావాలని మేయర్‌ గొలగాని.....

Published : 23 Jan 2022 05:51 IST


తొలి సంతకం చేస్తున్న మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో ప్రతీ పౌరుడు భాగస్వాములు కావాలని మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి పిలుపునిచ్చారు. శనివారం ఆమె జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11 నెలల నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నా కేంద్రం నిరంకుశంగా ముందుకు వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కట్టమూరు సతీష్‌, ఫ్లోర్‌లీడర్లు బాణాల శ్రీను, పీలా శ్రీనివాసరావు, గంగారావు, స్టాలిన్‌, బీశెట్టి వసంతలక్ష్మి తదితరులు మద్దతు తెలియజేస్తూ సంతకాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు