logo

AP News: విశాఖ ఉక్కు పరిరక్షణకు కోటి సంతకాల సేకరణ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట సమితి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది.

Updated : 23 Jan 2022 14:38 IST

విశాఖ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట సమితి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఫిబ్రవరి 12 నాటికి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఫిబ్రవరి 1నుంచి 7వ తేదీ వరకు కోటి సంతకాల సేకరణ జరుగుతుందని పోరాట సమితి నాయకులు వెల్లడించారు. కేంద్ర ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గాలని లేని పక్షంలో భాజపా కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని