logo

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

అగనంపూడి సమీప ఫార్మాసిటీ పునరావాస కాలనీ లేమర్తిలో ఆదివారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దువ్వాడ పోలీసుల వివరాల మేరకు... అనకాపల్లి మండలం తగరంపూడికి

Published : 24 Jan 2022 01:38 IST

ముమ్మన వరలక్ష్మి (పాత చిత్రం)

అగనంపూడి, న్యూస్‌టుడే : అగనంపూడి సమీప ఫార్మాసిటీ పునరావాస కాలనీ లేమర్తిలో ఆదివారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దువ్వాడ పోలీసుల వివరాల మేరకు... అనకాపల్లి మండలం తగరంపూడికి చెందిన ముమ్మన మల్లేశ్వరరావు(45)కి, లేమర్తికి చెందిన వరలక్ష్మితో (37) 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె చంద్రిక, కుమారుడు సాయి ఉన్నారు. ఫార్మాసిటీ పునరావాస కాలనీలోనే అద్దె ఇంట్లో ఉంటూ టైలరింగ్‌ చేస్తున్న మల్లేశ్వరరావు మద్యానికి బానిస కావడంతో.. వరలక్ష్మి కూలి పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తొంది. ఆదివారం తగరంపూడిలో పరస ఉండడంతో పిల్లల్ని అక్కడికి పంపించేశారు. ఆ తర్వాత తనని కూడా తీసుకెళ్లాలని భార్య కోరడంతో మల్లేశ్వరరావు నిరాకరించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత మనస్తాపానికి గురైన వరలక్ష్మి ఉరేసుకుని చనిపోయిందని మల్లేశ్వరరావు చెబుతున్నాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్షకు పంపించి, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దువ్వాడ సీఐ టి.లక్ష్మి తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని