logo

పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలంలోని కాపుసోంపురం గ్రామంలో పురుగు మందు తాగిన యువకుడు కొయిలాడ బాల (33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ తారకేశ్వకరావు అందించిన వివరాల ప్రకారం.. అనకాపల్లి ప్రాంతానికి

Published : 24 Jan 2022 01:38 IST

బాల (పాతచిత్రం)

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలంలోని కాపుసోంపురం గ్రామంలో పురుగు మందు తాగిన యువకుడు కొయిలాడ బాల (33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ తారకేశ్వకరావు అందించిన వివరాల ప్రకారం.. అనకాపల్లి ప్రాంతానికి చెందిన ఇతను మూడేళ్ల క్రితం ఈ గ్రామంలో ఒకరి వద్ద పనిచేయడానికి వచ్చాడు. ఇటీవల హోటల్‌ ప్రారంభించాడు. ఏమైందో ఏమో ఈనెల 14న దుకాణంలోనే పురుగు ముందు తాగేశాడు. ఇతన్ని గమనించిన భార్య శార్వాణి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అయితే  పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యానికి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడే బాల చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. ఇతను లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడని, దీన్ని చేతిరాత నిపుణులకు పంపిస్తామని ఎస్‌ఐ తారకేశ్వరరావు చెప్పారు. దీనిపై భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని