logo

లారీ ఢీకొని ఒకరి దుర్మరణం

జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విశాఖపట్నానికి చెందిన దాసరి శ్రీనివాస్‌ (40) ద్విచక్ర వాహనంపై రాజమహేంద్రవరం వెళ్తున్నారు. తమ్మయ్యపేట శివారు వద్ద ముందు వెళ్తున్న లారీ

Published : 24 Jan 2022 01:38 IST

తొండంగి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విశాఖపట్నానికి చెందిన దాసరి శ్రీనివాస్‌ (40) ద్విచక్ర వాహనంపై రాజమహేంద్రవరం వెళ్తున్నారు. తమ్మయ్యపేట శివారు వద్ద ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేకు వేయడంతో వెనుకే వస్తున్న ఆయన వాహనం లారీని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని 108 వాహనంలో తుని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందారు. భార్య తులసి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే తన భర్త మృతి చెందాడరి ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మోహన్‌కుమార్‌ తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: నెల్లిమెట్ట వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన అంజూరి శంకరావు (42) మరణించాడు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం తరలిస్తుండగా మరణించాడని గ్రామీణ ఎస్సై రమేష్‌ చెప్పారు. గాయపడిన వరలక్ష్మి, సత్యనారాయణ చికిత్స పొందుతున్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని