logo

రోడ్డు ప్రమాదంలో ఉక్కు ఉద్యోగి మృతి

ఉక్కునగరంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉద్యోగి మృతి చెందారు. స్టీల్‌ప్లాంట్‌ పోలీసుల వివరాల మేరకు.. విశాలాక్షినగర్‌ ప్రాంతానికి చెందిన టి.రత్నప్రసాద్‌ (53) కర్మాగారంలోని ఎస్‌ఎంఎస్‌-1లో జనరల్‌ ఫోర్‌మెన్‌గా

Published : 24 Jan 2022 02:17 IST

మృతుడు రత్నప్రసాద్‌

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే : ఉక్కునగరంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉద్యోగి మృతి చెందారు. స్టీల్‌ప్లాంట్‌ పోలీసుల వివరాల మేరకు.. విశాలాక్షినగర్‌ ప్రాంతానికి చెందిన టి.రత్నప్రసాద్‌ (53) కర్మాగారంలోని ఎస్‌ఎంఎస్‌-1లో జనరల్‌ ఫోర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం బి-షిఫ్ట్‌ విధులకు హాజరయ్యేందుకు కారులో వస్తుండగా... ప్రధాన పరిపాలన భవనం సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి చెట్టును బలంగా ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన్ను ఉక్కు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది స్టీల్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

చెట్టుని ఢీకొట్టిన కారు
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని