logo

గోవా మద్యంతో నలుగురి అరెస్టు

అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగుర్ని పేట పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై తాండవ కూడలిలో వాహన తనిఖీలు చేపట్టగా.. నక్కపల్లి వైపు కారులో వస్తున్న వ్యక్తులు పోలీసులను

Published : 24 Jan 2022 02:17 IST

పట్టుబడిన కారు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగుర్ని పేట పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై తాండవ కూడలిలో వాహన తనిఖీలు చేపట్టగా.. నక్కపల్లి వైపు కారులో వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కారులో గోవా నుంచి తీసుకువస్తున్న ఏడు మద్యం సీసాలు, చెర్రస్‌ (గంజాయితో చేసిన నల్లముద్ద)ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు విశాఖకు చెందిన రాజమనోహర్‌, అణికుమార్‌, షణ్ముక్‌సూర్యఅఖిల్‌, ప్రకాష్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని