logo

నగదు కాజేశాడని తనయుడిపై నింద..మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య

నిండుగొండ గ్రామానికి చెందిన అవుగడ్డ మల్లబ్బాయి (57) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై నాగకార్తిక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లబ్బాయి, పద్మ దంపతుల కుమారుడు గణేష్‌ కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

Published : 25 Jan 2022 05:35 IST

మల్లబ్బాయి

రోలుగుంట, న్యూస్‌టుడే: నిండుగొండ గ్రామానికి చెందిన అవుగడ్డ మల్లబ్బాయి (57) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై నాగకార్తిక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లబ్బాయి, పద్మ దంపతుల కుమారుడు గణేష్‌ కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కొద్దిరోజుల కిందట కంపెనీకి చెందిన రూ.5 లక్షల నగదును తన ఖాతాకు మళ్లించుకుని పరారయ్యాడని యాజమాన్యం ఆరోపిస్తోంది. ఈ నెల 23న గౌరీపరమేశ్వరుల ఉత్సవాలకు గణేష్‌ సొంతూరుకి వచ్చి ఉండవచ్చనే అనుమానంతో కంపెనీకి చెందిన 15 మంది మూడు వాహనాల్లో నిండుగొండ చేరుకుని ఆరా తీశారు. ఈ విషయాన్ని గణేష్‌ సోదరి పార్వతి తండ్రి మల్లబ్బాయికి ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన మల్లబ్బాయి పొలం పాకల వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చి కుప్పకూలిపోయాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని