logo

చెరువులో మునిగి రైతు మృతి

చెరువులో మునిగి మరుపాక శివారు గొల్లలపాలెంకు చెందిన రైతు మరిశా శ్రీను (31) మృతి చెందారు. రావికమతం ఎస్సై బి.జోగారావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీను తన పొలానికి నీరు పెట్టేందుకు ఈనెల 21న రాత్రి గ్రామంలోని మొగ్గచెరువుకు వెళ్లారు.

Published : 25 Jan 2022 05:35 IST

మరిశా శ్రీను (దాచిన చిత్రం)

రావికమతం, న్యూస్‌టుడే: చెరువులో మునిగి మరుపాక శివారు గొల్లలపాలెంకు చెందిన రైతు మరిశా శ్రీను (31) మృతి చెందారు. రావికమతం ఎస్సై బి.జోగారావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీను తన పొలానికి నీరు పెట్టేందుకు ఈనెల 21న రాత్రి గ్రామంలోని మొగ్గచెరువుకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో చెరువు కుటుంబసభ్యులు గాలించారు. ఈ క్రమంలో సోమవారం శ్రీను మృతదేహం చెరువులో తేలింది. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ముగినిపోయి మృతి చెందాడని ఎస్సై తెలిపారు. శ్రీనుకు భార్య సాయిలక్ష్మి, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం సాయిలక్ష్మి గర్భిణి.

గాయపడిన యువకుడు..

పాడేరు: మోదకొండమ్మ ఆలయం ఎదురుగా ఆదివారం కారు ఢీకొన్న ఘటనలో గాయపడిన దిలీప్‌(30) కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతి చెందినట్లు ఎస్సై లక్ష్మణ్‌ తెలిపారు. దిలీప్‌ పాత బస్టాండ్‌ సమీపంలో ఓ పులావ్‌ పాయింట్‌లో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని