మానవీయ సేవకు.. అత్యున్నత పురస్కారం!
పోలియో బాధితులు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారు. వారు కనిపిస్తే చాలు వారితో మమేకమవుతారు. బాగోగులు ఆరా తీస్తారు. అవసరమైన వారికి చికిత్స చేస్తారు. వారి వైకల్యం తగ్గి నడిచేలా చేస్తారు. బాధితులకు అవసరమైన కృత్రిమ కాళ్లు,
ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వీ ఆదినారాయణరావుకు పద్మశ్రీ
న్యూస్టుడే, విశాఖపట్నం(వన్టౌన్)
గీతం విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకుంటూ..
పోలియో బాధితులు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారు. వారు కనిపిస్తే చాలు వారితో మమేకమవుతారు. బాగోగులు ఆరా తీస్తారు. అవసరమైన వారికి చికిత్స చేస్తారు. వారి వైకల్యం తగ్గి నడిచేలా చేస్తారు. బాధితులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, మూడు చక్రాల సైకిళ్లు... ఇలా ఒకటేమిటి ఏదోరకంగా సహాయ అందిస్తారు.
గత నాలుగు దశాబ్దాలుగా అలుపెరగకుండా వైద్య రంగంలో సేవ చేస్తున్న ప్రముఖ ఎముకుల వైద్య నిపుణులు డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు కృషికి అత్యున్నత గుర్తింపు దక్కింది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించారు. పోలియో బాధితుల కోసం ఫ్రీపోలియో సర్జికల్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించి దశాబ్దాలుగా వారి సేవలో తరిస్తున్న డాక్టర్ ఆదినారాయణరావు సేవలకు గుర్తింపు దక్కింది.
భార్య డాక్టర్ శశిప్రభతో డాక్టర్ ఆదినారాయణరావు
* ఇదీ కుటుంబం: 1939 జూన్ 30న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన డాక్టర్ ఎస్వీ ఆదినారాయణరావు విశాఖ ఏఎంసీలో వైద్య కోర్సు పూర్తి చేశారు. ఎముకల విభాగంలో ఎంఎస్ చేసి వైద్య నిపుణునిగా పేరు గడించారు. ఆయన భార్య డాక్టర్ శశిప్రభ ఏఎంసీలో ఎంబీబీఎస్, గైనకాలజీ విభాగంలో ఎండీ చేశారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు. కుమార్తె డాక్టర్ శేషుకమల, అల్లుడు డాక్టర్ శ్రీధర్. వీరు లండన్లో వైద్యులుగా స్థిరపడ్డారు. కుమారుడు శశికిరణ్ ఇంజినీరింగ్ నిపుణుడు. కోడలు సోనాలి.
అవార్డులు ఇలా..
డాక్టర్ ఆదినారాయణరావు సేవలను మెచ్చి గతంలో ఏయూ, గీతం వర్సిటీలు డాక్టరేట్లు ఇచ్చి గౌరవించాయి. ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి నుంచి కూడా జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. క్రీడాభివృద్ధికి సైతం: నగరంలో ‘ప్రేమ’ ఆసుపత్రి స్థాపించి సేవలందిస్తున్నారు. ప్రేమ నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపి కళాశాల కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యదర్శిగా చాలా కాలం పాటు సేవలందించారు. విశాఖ నగరంలో ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలో సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ వైద్య సదస్సులు సైతం నిర్వహించారు. తాను చదివిన వైద్య కళాశాలలో వసతుల కల్పనకు ఎంతో కృషి చేశారు.
* ఇప్పటికీ అదే తపన: ఎస్వీ ఆదినారాయణ 1978 నుంచి వైద్య రంగంలో సేవలందిస్తున్నారు. నగరానికి చెందిన ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడి వద్ద చికిత్సా విధానాల్లో మెలకువలు తెలుసుకున్నారు. గురువు అడుగుజాడల్లో నడుస్తూ పోలియో బాధితుల సేవకు అంకితమయ్యారు. డాక్టర్ ఆదినారాయణరావు అన్నయ్య డాక్టర్ బాలపరమేశ్వరరావు ప్రముఖ న్యూరోసర్జన్. వీరి నుంచే తాను సేవాభావం అలవాటు చేసుకున్నానని, వారిచ్చిన స్ఫూర్తి, ప్రేరణతో ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. 82ఏళ్ల వయస్సులో కూడా పోలియో బాధితులకు సేవలందించేందుకు ఏ మాత్రం వెనుకడుగేయకుండా మున్ముందుకే అంటున్నారు.
మరింత బాధ్యత పెరిగింది..
ఇప్పటి వరకూ లక్షల మంది బాధితులను పరిశీలించా. దాదాపు మూడు లక్షల మందికి చికిత్సలు చేశా. 980కి పైగా వైద్య శిబిరాలను నిర్వహించా. కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం నా బాధ్యతలను మరింత పెంచింది. మున్ముందు మరింతగా సేవలను విస్తరిస్తా’ అని డాక్టర్ ఆదినారాయణరావు సంతోషం వెలిబుచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు