కొలిక్కొచ్చిన కొత్త జిల్లాల కూర్పు
కొత్త జిల్లాల కూర్పు కొలిక్కివచ్చింది. పార్లమెంటు నియోజకవర్గాలన్నీ ఒక్కో జిల్లాగా ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అరకు పార్లమెంటును మాత్రమే రెండు జిల్లాలుగా విభజించబోతున్నారు. ఈ నియోజకవర్గం భౌగోళికంగా నాలుగు జిల్లాల్లో
రెండు జిల్లాలుగా అరకు లోక్సభ
వాటికి అల్లూరి సీతారామరాజు, ‘మన్యం’ పేర్లు
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం న్యూస్టుడే, వన్టౌన్
కొత్త జిల్లాల కూర్పు కొలిక్కివచ్చింది. పార్లమెంటు నియోజకవర్గాలన్నీ ఒక్కో జిల్లాగా ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అరకు పార్లమెంటును మాత్రమే రెండు జిల్లాలుగా విభజించబోతున్నారు. ఈ నియోజకవర్గం భౌగోళికంగా నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండడంతో పరిపాలనా సౌలభ్యం కోసం రెండుగా విభజించనున్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంగా మన్యం, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఏర్పాటుకు ప్రతిపాదించారు.
విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల విషయంలో చిన్నచిన్న మార్పులు చేసి జిల్లాలుగా ప్రకటించనున్నారు. వీటికి సంబంధించి ఏ క్షణమైనా నోటిఫికేషన్ జారీచేయనున్నారు. దీనికి అనుగుణంగా జిల్లాల పునర్విభజనపై మంగళవారం కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి జిల్లా కేంద్రానికి సమాచారం వచ్చింది. రెవెన్యూ డివిజన్ల వారీ ఉన్న మండలాలు, జనాభా, విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం తదితర వివరాలు సత్వరమే పంపాలని ఆదేశాలు వచ్చాయి. ఆయా వివరాలపై నివేదికను రూపొందించి పంపే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. సీఎస్ సమీర్శర్మ వీసీలో కలెక్టర్ డా.మల్లికార్జున, ఇతర అధికారులతో మాట్లాడినట్లు తెలిసింది.
జిల్లాల పునర్వ్యస్థీకరణకు సంబంధించి జిల్లాస్థాయిలో అధికారుల కమిటీలను గతంలోనే నియమించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు ఏయే శాఖల వద్ద ఎన్నెన్ని ఆస్తులు (భూములు, భవనాలు) ఉన్నాయో గుర్తించారు. వాటికి జియోట్యాగింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వివరాలను సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేశారు. పాడేరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో అన్ని కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్ కార్యాలయంగా వినియోగించుకోనున్నారు. సెరికల్చర్ భవనం, భూములను, యూత్ ట్రైనింగ్ సెంటర్ను ఎస్పీ కార్యాలయం కోసం పరిశీలించారు.
* కొత్తగా ఏర్పాటు చేసే భీమునిపట్నం రెవెన్యూ డివిజన్లో ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం, విశాఖ గ్రామీణం, మహారాణిపేట తహసీల్దార్ కార్యాలయాలు ఉండనున్నాయి.
* అరకు కూర్పు ఇలా: అరకు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాలూరు, కురపాం, పాలకొండ, పార్వతీపురం కలిపి మన్యం జిల్లాగా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు. అరకులోయ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలను అల్లూరి సీతారామరాజు(ఏఎస్ఆర్) జిల్లాగా ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రతిపాదిత 26 జిల్లాల్లో జనాభా పరంగా చూస్తే ఏఎస్ఆర్ జిల్లా 9,53,960 మందితో ఆఖరి స్థానంలో నిలుస్తుంది. తరువాత స్థానంలో మన్యం జిల్లా 9,72,195 మందితో ఉంటుంది. మొత్తం జిల్లాల్లో ఈ రెండు మాత్రమే 10 లక్షల లోపు జనాభాతో ఉండనున్నాయి.
* అనకాపల్లిలో: ప్రతిపాదిత అనకాపల్లి జిల్లాలో పాలనా పరమైన భవనాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను ఇదివరకు పరిశీలించారు. తుమ్మపాల చక్కెర కర్మాగారానికి చెందిన భూములు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. వాటితో పాటు కొత్తూరుకు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్డీవో కార్యాలయం, పరిసర భూములను పరిశీలించారు. జిల్లా అవతరించిన తర్వాత కొన్నాళ్లు పాటు అద్దె భవనాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే జిల్లా స్థాయి తగ్గ భవనాలు ఇక్కడ సిద్ధంగా లేవు. అనకాపల్లి లోక్సభ పరిధిలో నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట, అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి సెగ్మెంట్లున్నాయి.
* విశాఖ జిల్లా ఇలా: విశాఖ జిల్లా పరిధి మరింత తగ్గనున్నది. దీని పరిధిలో నగర పరిధిలో ఉన్న నాలుగు సెగ్మెంట్లు, గాజువాక, భీమిలి రానున్నాయి. శృంగవరపు కోట (ఎస్.కోట) నియోజకవర్గం విశాఖ లోక్సభ పరిధిలో ఉన్నా దాన్ని తప్పించబోతున్నారు. భీమునిపట్నం రెవెన్యూ డివిజన్గా అవతరించబోతోంది. నగరంలో ఇప్పటికే కలెక్టర్, జేసీలు, ఎస్పీ, పోలీసు కమిషనరేట్ తదితర కార్యాలయాలకు పక్కా భవనాలున్నాయి. కొత్త భవనాలు వంటి అవసరాలు పెద్దగా లేవు. పెందుర్తి అనకాపల్లి జిల్లా పరిధిలోకి వెళితే పారిశ్రామికంగా విశాఖకు కొంత ఇబ్బందే. పారిశ్రామిక ప్రాంతాలు కుదించుకుపోయే అవకాశం ఉంది.
త్వరలో నోటిఫికేషన్..
-ఎ.మల్లికార్జున, కలెక్టర్, విశాఖపట్నం
విశాఖ జిల్లా పరిధిలోకి విజయనగరంలో ఉన్న ఎస్.కోట అసెంబ్లీ సెగ్మెంట్ రావడం లేదు. పెందుర్తి నియోజకవర్గం అనకాపల్లి పరిధిలోనే ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రానున్నది. గతంలో పునర్విభజనకు సంబంధించిన వివరాలు పంపాం. అప్పట్లో కొన్ని ప్రతిపాదనలు వెళ్లాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM