బిడ్డా.. ఇది నా అడ్డా..!
ప్రభుత్వ శాఖలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మత్తు పదార్థం ‘గంజాయి’ రవాణా ఆగడం లేదు. కొద్దిరోజులుగా వరుసగా గంజాయి పట్టుబడుతున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ. మత్తుపదార్థాల మాఫియాకి మన మన్యమే అడ్డాగా భాసిల్లుతోంది. వెనకుండి నడిపించేవారు ఎవరో కనిపెట్టి పట్టుకోవడం అరుదైపోయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన అమాయకులు మాత్రం రవాణాలో దొరికిపోయి జైలుపాలవుతున్నారు.
గంజాయి మాఫియాకు చిరునామాగా మన్యం
వేల ఎకరాలు ధ్వంసం చేసినా ఆగని రవాణా
నర్సీపట్నం అర్బన్, చింతపల్లి, పాడేరు - న్యూస్టుడే
ప్రభుత్వ శాఖలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మత్తు పదార్థం ‘గంజాయి’ రవాణా ఆగడం లేదు. కొద్దిరోజులుగా వరుసగా గంజాయి పట్టుబడుతున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ. మత్తుపదార్థాల మాఫియాకి మన మన్యమే అడ్డాగా భాసిల్లుతోంది.
వెనకుండి నడిపించేవారు ఎవరో కనిపెట్టి పట్టుకోవడం అరుదైపోయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన అమాయకులు మాత్రం రవాణాలో దొరికిపోయి జైలుపాలవుతున్నారు.
గత ఏడాది ప్రత్యేక కార్యక్రమంగా పలుశాఖల అధికారులు సంయుక్తంగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు. 7226 ఎకరాల్లో రూ.8,875 కోట్లు విలువైన గంజాయి మొక్కలు ధ్వంసం చేసినట్టు డిసెంబరు నెలాఖరులో డీజీపీ గౌతంసవాంగ్ ప్రకటించారు. ఇంత ధ్వంసం జరిగిన తరువాత రవాణా ఆగిపోతుందని అందరు భావించారు. ఇందుకు విరుద్దంగా దాదాపు రోజూ ఎక్కడోచోట నాణ్యమైన శీలావతి రకం పొడి గంజాయి, లేదా అత్యంత ఖరీదైన ద్రవరూప గంజాయి దొరుకుతూనే ఉంది.
తాజాగా మంగళవారం నర్సీపట్నం
ఓ కారుని వెంటాడి మహరాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 240 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం కొయ్యూరు మండలం డౌనూరు చెక్పోస్టు వద పసుపులోడుతో వస్తున్న ఓ లారీని తనిఖీ చేస్తే పసుపు బస్తాల కింద సరకు దాచినట్టు గుర్తించారు. వెయ్యి కేజీలకు పైగా ఉండొచ్చని అనధికార సమాచారం. నిందితులు పరారయ్యారు. దీంతో ఈ కేసు వివరాలను ఇంకా పోలీసులకు అధికారంగా ప్రకటించలేదు.
* సరిగ్గా 26 రోజుల క్రితం అనంతగిరి మండలం గుమ్మకోట వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వ్యాన్ను వెంబడించారు. నిందితుడు పరారయ్యాడు. వ్యాన్లో 600 కేజీల గంజాయి దొరికింది. ఈనెల నాలుగో తేదీన పిఠాపురానికి చెందిన దంపతులు వ్యాన్లో వస్తూ నర్సీపట్నం పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంబడించి పట్టుకుంటే 50 కేజీలు దొరికింది.
* తాటిపర్తి చెక్పోస్టు వద్ద ఈనెల ఐదున బెంగళూరు చెందిన ఇద్దరు నుంచి 500 గ్రాముల లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేరోజు యూపీకి చెందిన ఇద్దరి నుంచి 18 కేజీలు స్వాధీనం చేసుకున్నారు.
* సీలేరు జెన్కో చెక్పోస్టు వద్ద ఈనెల ఆరున యూపీకి చెందిన వారి నుంచి 80 కేజీలు స్వాధీనం చేసుకున్నారు.
ఈనెల ఏడున బూరిసింగికి చెందిన గిరిజనుడు నుంచి ఏకంగా రూ.15 లక్షలు విలువైన తొమ్మిది కేజీల ద్రవరూప గంజాయి, అదేరోజు అరకులో 160 కేజీల, తొమ్మిదో తేదీన కాగిత టోల్గేటు దగ్గర తమిళనాడుకు చెందిన వ్యాన్లో తొమ్మిది వందల కేజీల సరకు పట్టుబడింది.
పాత నిల్వలేనా...?
ప్రస్తుతం రవాణా జరుగుతున్న మత్తుపదార్థమంతా పాత నిల్వలేనని అధికారులు భావిస్తున్నారు. గిరిజనులు పంట చేతికొచ్చాక మారుమూల అడవుల్లో ఎవరికి కనిపించని విధంగా నిల్వ చేస్తుంటారని చెబుతున్నారు. రెండు, మూడు నెలల పాటు రవాణా కొనసాగవచ్చంటున్నారు. తోటలు దాదాపు 70, 80 శాతం ధ్వంసం చేసినందున ఇకపై రవాణా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.
శీలావతి రకం గంజాయికి గిరాకీ ఉండడంతో తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, గోవా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల వారు ఇక్కడకు వస్తున్నారు.ద్రవరూప సరకు లీటరు లక్ష రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం.
నర్సీపట్నంలో మంగళవారం పోలీసులకు పట్టుబడిన కారు
సాధారణంగా ఏ వస్తువుకయినా కొరత ఏర్పడితే దాని ధర సహజంగానే భారీగా పెరుగుతుంది. ఇప్పుడు గంజాయి విషయంలోనూ అదే జరుగుతోంది. సాధారణ రోజుల్లో కేజీ గంజాయి మన్యం నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తే రూ. 2,000 వేల వరకూ వ్యాపారులు చెల్లించేవారు. ఇప్పుడు మన్యంలో తోటలను అధికారులు ధ్వంసం చేయడంతో దీనికి కొరత ఏర్పడింది. ఈ కారణంగా ప్రస్తుతం కేజీ సరకు మన్యం నుంచి మైదాన ప్రాంతానికి చేరవేస్తే రూ. 8 నుంచి రూ.10 వేల వరకూ వ్యాపారులు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే గంజాయి సాగు, రవాణాపై అధికారులు దాడులు చేపడుతున్నా.. అధికారుల కళ్లు కప్పి సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.
స్వచ్ఛందంగా ధ్వంసం
ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం గత ఏడాది అక్టోబరు 30 నుంచి ఈ నెల 11 వరకు చేపట్టారు. పాడేరు, చింతపల్లి, గొలుగొండ ఎస్ఈబీ స్టేషన్ల పరిధిలో 395 ఎకరాల గంజాయి తోటలను గిరిజనులు స్వచ్ఛందంగా తొలగించారు. మిగతా తోటలను అధికారులు ధ్వంసం చేశారు. పన్నెండు వందల అడుగుల ఎత్తున ఉన్న ఓ కొండపై ఐదెకరాల్లో గంజాయి సాగు జరగడం అధికారులను విస్మయపరిచింది. వరి సాగు వెంబడి గంజాయి మొక్కలను పెంచడం గుర్తించారు. నర్సీపట్నం ఏఈఎస్ పరిధిలో 18 కేసుల్లో 23 మందిని అరెస్టు చేసి 1149 కేజీలు స్వాధీనం చేసుకుని ఎనిమిది వాహనాలను సీజ్ చేశామని ఏఈఎస్ రాజు తెలిపారు.
శాశ్వత చెక్పోస్టుల ఏర్పాటు
- సతీష్కుమార్, సెబ్ జాయింట్ డైరెక్టర్
మన్యం వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 7,600 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశాం. ఈ సాగు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మిగిలి ఉంది. ఇవి పూర్తిగా ఒడిశా సరిహద్దు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అక్కడకు వెళ్లేందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. డౌనూరు, వడ్డాది మాడుగుల, కృష్ణదేవిపేట తదితర ప్రాంతాల్లో శాశ్వత చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. మన్యంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించే దిశగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో మాఫియాల స్వైర విహారం: కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
[ 24-04-2024]
ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. -
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.