AP News: వైకాపా నాయకుడి బీభత్సం..రెవెన్యూ సిబ్బందిపై దాడి
ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై వైకాపా నాయకుడు అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. అధికారులు తీసుకెళ్లిన పొక్లెయిన్ను సైతం తగలబెట్టేస్తామనడంతో చేసేది లేక ఉద్యోగులు వెనుదిరిగారు. దీనికి సంబంధించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపిన వివరాలు ఇవి. జీవీఎంసీ 88వ వార్డు సత్తివానిపాలెం సర్వేనంబరు 355లో సుమారు 100 ఎకరాల్లో రేవళ్ల చెరువు ఉంది.అందులో నుంచే గ్రామస్థులు రాకపోకలు సాగిస్తుండటంతో పంచాయతీ హయాంలోనే రోడ్డు నిర్మించారు.
ఆక్రమణలు అడ్డుకోడానికి వెళ్లగా ప్రతిఘటన
పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
న్యూస్టుడే, వేపగుంట, పెందుర్తి
ఉద్యోగులను హెచ్చరిస్తూ...
వైకాపా నాయకుడు, అతని అనుచరులు సృష్టించిన హడావుడి కలకలం రేపింది.
ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన తీరు నివ్వెరపరిచింది. భూ ఆక్రమణలను అడ్డుకోవటానికి వెళ్లిన వారిని మాటలతో బెదిరించి.. చేయి చేసుకొని భయానక వాతావరణం సృష్టించిన తీరు చర్చనీయాంశమయింది.
రెవెన్యూ అధికారులపై దాడిచేస్తున్న దొడ్డి కిరణ్, అతని అనుచరులు
ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై వైకాపా నాయకుడు అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. అధికారులు తీసుకెళ్లిన పొక్లెయిన్ను సైతం తగలబెట్టేస్తామనడంతో చేసేది లేక ఉద్యోగులు వెనుదిరిగారు. దీనికి సంబంధించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపిన వివరాలు ఇవి. జీవీఎంసీ 88వ వార్డు సత్తివానిపాలెం సర్వేనంబరు 355లో సుమారు 100 ఎకరాల్లో రేవళ్ల చెరువు ఉంది.అందులో నుంచే గ్రామస్థులు రాకపోకలు సాగిస్తుండటంతో పంచాయతీ హయాంలోనే రోడ్డు నిర్మించారు. అందులో 10 ఎకరాలపైనే సాధారణ మైదాన భూమిగా మారిపోయింది. దీనిపై కొందరు కబ్జాదారుల కన్నుపడింది. కొద్దిరోజుల క్రితం 89వ వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్, అనుచరులు సుమారు 60 సెంట్ల భూమిలో సిమెంట్ పలకలతో ఫెన్సింగ్ వేశారు. ఈ భూమి విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుంది. ఈ ఆక్రమణలపై పెందుర్తి తహసీల్దారు కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఎమ్మార్వో ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్, వీఆర్వో రమేష్, సర్వేయర్ జగదీశ్, పలువురు సిబ్బంది పొక్లెయిన్ తీసుకుని గురువారం ఉదయం ఆక్రమణలు తొలగించడానికి వెళ్లారు. సగం ఆక్రమణలు తొలగించే సరికి వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్, అతని అనుచరులు రెవెన్యూ అధికారులపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఆర్ఐ శివకుమార్ను కాళ్లతో తన్నారు. మిగతా సిబ్బందిపై కూడా దాడిచేసి, బెదిరించారు. రెవెన్యూ సిబ్బంది దీనిని చరవాణిలో చిత్రీకరించటానికి ప్రయత్నించగా.. ఫోన్లను లాగేసుకున్నారు. పొక్లెయిన్ను స్వాధీనం చేసుకొని కాల్చివేస్తామని బెదిరించారు. దీంతో చేసేదిలేక ఉద్యోగులు పెందుర్తి ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం పలువురు ఉద్యోగులు పెందుర్తి పోలీసు స్టేషన్ ముందు నిరసన తెలిపి ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఆర్ఐ శివకుమార్
దొడ్డి కిరణ్పై కేసు నమోదు: రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడిన వైకాపా నేత దొడ్డి కిరణ్ (గత ఏడాది కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశారు), మరో 20మందిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఐ శివకుమార్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్కుమార్ తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
పెందుర్తి పోలీస్ స్టేషన్ కూడలి వద్ద ఆందోళన చేస్తున్న రెవెన్యూ సిబ్బంది
సీపీకి కలెక్టర్ లేఖ: ఈ ఘటనపై కలెక్టర్ మల్లికార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై నివేదిక రప్పించుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ను ఆదేశిస్తూ లేఖ రాశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన దొడ్డి కిరణ్పై క్రిమినల్ కేసు పెట్టడంతో ప్రభుత్వ భూమి ఆక్రమణ కింద వివిధ సెక్షన్లతో కేసు పెట్టాలన్నారు. ఆర్ఐ, సర్వేయర్ల మీద తిరగబడిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ః తమకు రక్షణ లేకపోతే ఆక్రమణలు తొలగింపులు సాధ్యం కాదకాదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
* ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!
[ 23-04-2024]
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం. -
అట్టహాసంగా శ్రీభరత్ నామినేషన్
[ 23-04-2024]
తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్ సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
దిగజారిన స్థానం!!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
వంచన మాటలు.. పింఛన్లపై తూటాలు!!
[ 23-04-2024]
పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్ అవ్వాతాతలను వంచించారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని బూటకపు మాటలతో మోసం చేశారు. -
మెరుపుల ప్రచారం
[ 23-04-2024]
దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్కు చెందిన పలు ప్రచార వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తున్నాయి. -
తెదేపాలోకి వలసల వరద
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉన్న సమయంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు. -
కూటమి మోగిస్తుంది విజయ దుందుభి
[ 23-04-2024]
తెదేపా కూటమి జిల్లాలో విజయం సాధించడం ఖాయమని నేతలు పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో ఆగని అఘాయిత్యాలు
[ 23-04-2024]
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ సోమవారం నామపత్రం దాఖలు చేశారు. -
కలెక్టరేట్లోకి వెళ్లకుండా వెలగపూడి అడ్డగింత
[ 23-04-2024]
తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ నామపత్రాల దాఖలు సందర్భంగా కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. -
రసాభాసగా మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం
[ 23-04-2024]
సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. -
మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు
[ 23-04-2024]
కార్మిక శాఖ ఎ.పి. దుకాణాలు, సంస్థల చట్టం-1988 ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరిగే మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆదూరు గణేశన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
కూటమి విజయంతోనే అభివృద్ధి
[ 23-04-2024]
కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పెందుర్తి మండలం విద్యార్థులు సత్తాచాటారు. -
ముగిసిన హస్తకళలపై శిక్షణ
[ 23-04-2024]
పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్స్కూల్లోని విద్యార్థులకు మూడు రోజుల నుంచి జరుగుతున్న హస్తకళలపై శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. -
అధ్యాపకుల సేవలు అభినందనీయం
[ 23-04-2024]
సబ్బవరం గురుకుల కళాశాలలో ఎక్కువ కాలం పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాకులు జాన అప్పారావు, బద్రికూర్మారావుల సేవలు చిరస్మరణీయమని జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి అన్నారు. -
ఏడు నియోజకవర్గాలకు 22 నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
గడువు తేదీ సమీపిస్తుండడంతో నామపత్రాల దాఖలు ప్రక్రియ వేగం పుంజుకుంది. -
ఇంటి నుంచి ఓటుకు 26 వరకు గడువు
[ 23-04-2024]
ఇంటి నుంచి ఓటు కోసం వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకొనే గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇద్దరు యువకులను బలిగొన్న 108 అంబులెన్స్
[ 23-04-2024]
ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్