logo

సచివాలయ ఉద్యోగిని మోసగించిన యువకుడికి రిమాండ్‌

గ్రామ సచివాలయ ఉద్యోగినిని ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు పంపించారు. చోడవరం సీఐ సయ్యద్‌ ఇలియాస్‌ మహ్మద్‌ తెలిపిన వివరాల

Published : 28 Jan 2022 04:51 IST

చీడికాడ, న్యూస్‌టుడే: గ్రామ సచివాలయ ఉద్యోగినిని ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు పంపించారు. చోడవరం సీఐ సయ్యద్‌ ఇలియాస్‌ మహ్మద్‌ తెలిపిన వివరాల ప్రకారం. అప్పలరాజుపురం గ్రామానికి చెందిన చీడికాడ ఎంపీపీ కుమారుడు కురచా అప్పయ్య పృథ్వీనాయుడు తనను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి, మరొకరితో వివాహానికి సిద్ధమవుతున్నట్లు ఓ గ్రామ సచివాలయ ఉద్యోగిని ఈనెల 24న చీడికాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదే రోజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఎస్సై సుధాకరరావు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని