logo

మాడుగులపై మాట నిలుపుకొన్న సీఎం: విప్‌

అనకాపల్లి జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గం ఉంటుందని, తనకు ఇచ్చిన హామీని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకుని నియోజకవర్గ ప్రజల మనసులు గెలుచుకున్నారని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు అన్నారు.

Published : 28 Jan 2022 04:51 IST

బైక్‌ ర్యాలీలో ముత్యాలనాయుడు, వైకాపా నేతలు

మాడుగుల, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గం ఉంటుందని, తనకు ఇచ్చిన హామీని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకుని నియోజకవర్గ ప్రజల మనసులు గెలుచుకున్నారని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు అన్నారు. మాడుగులను అనకాపల్లి జిల్లాలో ఉంచుతూ ప్రతిపాదించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ గురువారం వైకాపా శ్రేణులు నియోజకవర్గ స్థాయి బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. తొలుత ఘాట్‌ రోడ్డు కూడలిలో అంతా సమావేశమయ్యారు. విప్‌ మాట్లాడుతూ తొలుత మాడుగులను అరకు జిల్లాలో కలుపుతారని వచ్చిన వార్తలపై తాను సీఎంను కలిసి అనకాపల్లిలోనే ఉంచాలని కోరినట్లు గుర్తుచేశారు. అప్పుడు మాటిచ్చి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంపై సీఎం జగన్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున విప్‌ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నాయకులతో కలిసి విప్‌ బైక్‌లతో ర్యాలీగా మాడుగుల వచ్చారు. బస్టాండులో జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పట్టణం అంతా తిరిగారు. ఎంపీపీ రామధర్మజ, ఉపాధ్యక్షులు తాళపురెడ్డి రాజారామ్‌, జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ, సర్పంచి యడ్ల కళావతి, సేనాపతి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని