logo

150 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాలోని ఇద్దరు వ్యక్తులను ఎస్‌ఈబీ గాజువాక అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ మన్మథరావు వివరాల మేరకు... హుకుంపేట, పెదబయలు ప్రాంతాలకు చెందిన

Published : 28 Jan 2022 04:51 IST

సరకు, నిందితులతో ఎస్‌ఈబీ అధికారులు

గాజువాక, న్యూస్‌టుడే : విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాలోని ఇద్దరు వ్యక్తులను ఎస్‌ఈబీ గాజువాక అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ మన్మథరావు వివరాల మేరకు... హుకుంపేట, పెదబయలు ప్రాంతాలకు చెందిన వి.రాజు, ఎల్‌.నాని, మరో ఇద్దరు కలిసి ఆటోలో 150 కిలోల గంజాయితో అగనంపూడి వస్తున్నారని అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో ఎస్‌ఈబీ సిబ్బంది దాడి చేశారన్నారు. ఇద్దరు నిందితులు పరారవ్వగా, మిగిలిన ఇద్దరు పట్టుబడ్డారన్నారు. సరకును స్వాధీనం చేసుకుని ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశామన్నారు. ఎస్‌ఈబీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని