కళ్లాల్లో ధాన్యం.. కళ్లలో దైన్యం
ఖరీఫ్ పంటలను మద్దతు ధరకు కొంటాం. కళ్లానికే వచ్చి తీసుకువెళతాం.. 21 రోజుల్లో సొమ్ములు రైతుల ఖాతాల్లో జమచేస్తామని సర్కారు చెబుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. రైతుల చెంతకు వచ్చి ఆరా తీసేవారు లేరు.
ఈ-క్రాప్ నిబంధనతో దళారులకే పంట
-ఈనాడు డిజిటల్, విశాఖపట్నం న్యూస్టుడే బృందం
ఖరీఫ్ పంటలను మద్దతు ధరకు కొంటాం. కళ్లానికే వచ్చి తీసుకువెళతాం.. 21 రోజుల్లో సొమ్ములు రైతుల ఖాతాల్లో జమచేస్తామని సర్కారు చెబుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. రైతుల చెంతకు వచ్చి ఆరా తీసేవారు లేరు. పోనీ ఆర్బీకేలకు వెళితే సాంకేతిక సమస్యలంటూ తిప్పుతున్నారు.. మిల్లర్ల దగ్గరకు వెళితే గోదాములు ఖాళీ లేవంటున్నారు. చేతిలో ధాన్యమున్నా అమ్ముకోవడానికి అగచాట్లు పడాల్సివస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదిలేక వ్యాపారులకే పంటను అప్పగించి నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు.
సీరియల్ నంబర్ వచ్చేవరకు ఆగాల్సిందే..
ఆర్బీకేలకు ధాన్యం తీసుకువస్తామని రైతులు ముందుగా సమచారం ఇస్తే వారికి ఒక నంబర్ రాసి ఇస్తున్నారు. అంతకంటే ముందున్నవారంతా అయిపోయిన తరువాత ఆ రైతు దగ్గర నుంచి ధాన్యం తీసుకుంటామంటున్నారు. మునగపాకలోని రైతు బొడ్డేడ ఈశ్వరరావు పంట నూర్చి 90 బస్తాలు వారం రోజులుగా కళ్లంలోనే పెట్టుకుని నిరీక్షిస్తున్నాడు. ఆర్బీకేలో అమ్మడానికి వెళితే నీది 42వ నంబర్, నీ ముందున్నవారు అయిపోతే మీవే తీసుకుంటాం ఆగండంటున్నారు. ఇప్పటికి ఆరు రోజులవుతున్నా ధాన్యం తీసుకునే దిక్కులేకుండా పోయిందని రైతు ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ-క్రాప్ తంటాలు..
ఈ-క్రాప్లో నమోదైన రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఏజెన్సీలో చాలామంది ఈ-క్రాప్పై అవగాహన లేక నమోదు చేయించుకోలేకపోయారు. కొంతమంది ప్రయత్నించినా నెట్వర్క్ సమస్యలతో సాధ్యం కాలేదు. దీంతో మన్యంలో ధాన్యం కొనుగోళ్లు సాగ[డం లేదు. ఇటీవల కొయ్యూరు మండలం జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు గట్టిగా నిలదీయడంతో ఆ మండలంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మమ అనిపించేశారు. మిగతాచోట్ల ఇప్పుడిప్పుడు కొనుగోలు కేంద్రాలు తెరవడానికి చర్యలు తీసుకుంటున్నారు.
గాలిపోత పోస్తున్న కూలీలు
అడ్డగోలుగా వసూళ్లు..
నర్సీపట్నానికి చెందిన లాలం అప్పారావు మాట్లాడుతూ గోనె సంచులు ఆర్బీకేలో రాలేదన్నారు. ఒక్కో గోనె సంచిని రూ.18 చొప్పున కొనుక్కున్నాం. మిల్లు యజమాని ఆ సంచులకు రూ.10 చొప్పున తిరిగి ఇచ్చాడు. కాటా ఖర్చులంటూ ఓ వంద రూపాయలు తీసుకున్నారు. మళ్లీ నమూనాలు పరీక్షించాలంటూ బస్తాకి వందగ్రాముల ధాన్యం తీసుకున్నారు. ఇష్టం ఉంటే ఇవ్వండి లేదంటే ధాన్యం పట్టుకుపోండి అని తెగేసి చెప్పారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ ఏడాది భారీ వర్షాలు నమోదైనా వరి దిగుబడి ఆశాజనకంగానే వచ్చింది. 1.30 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. దీనికోసం 175 రైతు భరోసా కేంద్రాల పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతుల చెంతకే ఇచ్చి కొనుగోలు చేస్తారని ప్రచారం చేశారు. ఎక్కడా ఆ పరిస్థితి లేదు. రైతులే సొంత ఖర్చులతో ఆటోలు, వ్యాన్లు ఏర్పాటు చేసుకుని కొనుగోలు కేంద్రాలైన పీఏసీఎస్లు, రైతు భరోసా కేంద్రాలకు బస్తాలలో తీసుకెళుతున్నారు.
కాగితలో ఈ చిన్న గదే ఆర్బీకే
నష్టపోతున్నారిలా..
సాధారణ రకం క్వింటాలు రూ.1940, ఏ గ్రేడు రకానికి రూ.1960 మద్దతు ధర చెల్లించాలి. రైతు బయట అమ్ముకున్నా ఇదే ధర దక్కాలి. దళారులు 80 కేజీల బస్తాకు రూ.1250 నుంచి రూ.1300 మాత్రమే ఇస్తున్నారు. మట్టి బెడ్డలుంటున్నాయని నాలుగైదు కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. దీంతో ఒక్కో బస్తా దగ్గర రూ.300 వరకు నష్టపోతున్నాడు. ధరలోనే కాకుండా తూకంలోనూ మోసగిస్తున్నారు. గతంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల నుంచి వారంలో సొమ్ము ఇచ్చేవారు. ఈ ఏడాది 21 రోజులైతేగానీ ఇవ్వలేమని ముందే చెప్పేశారు. ఇప్పటి వరకు కేవలం తొమ్మిది వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో చాలామంది ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కంటే సరకు తీసుకున్న వెంటనే సొమ్ములు చెల్లించే దళారులనే ఆశ్రయిస్తున్నారు. ధర తగ్గినా.. తూకంలో మోసం చేసినా వెంటనే డబ్బులందుతున్నాయని రైతులంటున్నారు. పైగా హమాలీ ఛార్జీలు, రవాణా ఖర్చులు ఇవేవీ ఉండడం లేదని అందుకే ప్రైవేటు వర్తకుల వైపే మొగ్గుచూపుతున్నారు.
సర్వర్ సమస్య వల్లే..
-రాజేశ్వరి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ సమస్య ఉంది. అయినా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నాం. జిల్లాలో పండగ తరువాతే ఎక్కువ మంది ధాన్యం తెస్తుంటారు. లక్ష్యం మేరకు అందరి దగ్గర పంట కొనుగోలు చేస్తాం. రైతుల ఖాతాలకు సొమ్ములు కూడా జమవుతున్నాయి. దళారులను ఆశ్రయించి మోసపోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా