logo

రౌడీషీటర్‌ వీరంగం

రౌడీషీటర్‌ మంగళవారం అర్ధరాత్రి కత్తితో వీరంగం సృష్టించాడు. తన గ్యాంగ్‌తో కలిసి బీరుసీసాలు, రాడ్లతో నలుగురు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచాడు. పోలీసులు తెలిపిన వివరాలివి.

Published : 19 May 2022 04:32 IST

కత్తులు, బీరుసీసాలతో దాడి


జతిన్‌ చేతిపై గాయాలు

గురుద్వారా, న్యూస్‌టుడే: రౌడీషీటర్‌ మంగళవారం అర్ధరాత్రి కత్తితో వీరంగం సృష్టించాడు. తన గ్యాంగ్‌తో కలిసి బీరుసీసాలు, రాడ్లతో నలుగురు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. మంగళవారం తాటిచెట్లపాలెంలో జరిగిన పరదేశమ్మవారు పండగలో నీరజ్‌, జతిన్‌ నృత్యాలు చేస్తుండగా అక్కడికి వెళ్లిన రౌడీషీటర్‌ పెద్దిశెట్టి రూపేశ్‌, డాన్‌ శ్రీనులు నీరజ్‌ కాలు తొక్కారు. నా కాలు ఎందుకు తొక్కారంటూ నీరజ్‌ ప్రశ్నించగా.. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ తీసేసుకొని కేవీ పాఠశాల వద్దకు వస్తే ఇస్తామన్నారు. దీంతో నీరజ్‌ తనకు తోడుగా జతిన్‌, సాయి, శ్యామ్యూల్‌ను వెంట తీసుకెళ్లాడు. వీరు రాగానే అక్కడ ఉన్న శ్రీను, రూపేశ్‌, తరుణ్‌లు కత్తులు, బీరుసీసాలతో దాడిచేశారు. గాయాలపాలైన వారిలో జతిన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని