logo

ముఖ్యమంత్రిని కలిసినా వీడని ఉత్కంఠ

విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి మళ్ల విజయ ప్రసాద్‌ గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినా ఆ నియోజకవర్గంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడలేదు. మళ్ల విజయప్రసాద్‌ ఆధ్వర్యంలోనే పార్టీకి సంబంధించిన

Published : 20 May 2022 04:54 IST

సీఎం జగన్‌ను సన్మానిస్తున్న మళ్ల విజయప్రసాద్‌ దంపతులు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి మళ్ల విజయ ప్రసాద్‌ గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినా ఆ నియోజకవర్గంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడలేదు. మళ్ల విజయప్రసాద్‌ ఆధ్వర్యంలోనే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రాథమిక సమాచారం. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆయన్ను కొనసాగిస్తున్నారా? లేదా? అన్న ప్రశ్నకు మాత్రం పార్టీలోని ఎవరికీ సమాచారం లేకపోవడం గమనార్హం. మళ్ల సూచించిన వ్యక్తులకు ఇన్‌ఛార్జి బాధ్యతలు కొద్దికాలం అప్పగించవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. సుదీర్ఘకాలం నుంచి పార్టీకి సేవలందించిన మళ్ల గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆ జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ సమయానికి పశ్చిమ నియోజకవర్గంపై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తోంది. అప్పటి వరకూ మళ్ల విజయప్రసాద్‌ పదవికి ఢోకా లేదని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని