వైకాపా కార్యాలయానికి 2 ఎకరాలు
జిల్లా వైకాపా కార్యాలయం నిర్మాణానికి అవసరమైన 2 ఎకరాల స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనకు మేయర్ ముందస్తు అనుమతి ఇవ్వగా, దాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకొస్తున్నారు. ఈనెల 26న జీవీఎంసీలో జరగనున్న పాలకవర్గం
ఎన్ఏడీ పైవంతెనకు వైఎస్ఆర్ పేరు
కౌన్సిల్ సమావేశంలో ఆమోదానికి కసరత్తు
కార్పొరేషన్, న్యూస్టుడే: జిల్లా వైకాపా కార్యాలయం నిర్మాణానికి అవసరమైన 2 ఎకరాల స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనకు మేయర్ ముందస్తు అనుమతి ఇవ్వగా, దాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకొస్తున్నారు. ఈనెల 26న జీవీఎంసీలో జరగనున్న పాలకవర్గం సమావేశంలో 63 అంశాలపై చర్చించనున్నారు. అజెండా కాపీలను బుధవారం సభ్యులకు అందజేశారు.
అజెండాలో ఏముందంటే: ఎండాడలోని ప్రభుత్వ స్థలాన్ని వైకాపా కార్యాలయం నిర్మాణానికి కేటాయించనున్నారు. వీఎంఆర్డీఏ నిర్మించిన ఎన్ఏడీ పైవంతెనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరు పెట్టాలన్న ప్రతిపాదనలపై మేయరుకు వీఎంఆర్డీఏ కమిషనర్ లేఖ రాయగా ఆమోదించడానికి పాలకవర్గ సమావేశం అజెండాలో పొందుపరిచారు. జీవీఎంసీకి చెందిన మల్కాపురం, ఆరిలోవ డిస్పెన్సరీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి అనువుగా అజెండాలో చేర్చారు. ఇందుకు రూ.2.10 కోట్లను కేటాయించ నున్నారు. జీవీఎంసీకి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించగా, రెండు ఎఫ్ఆర్యూ (ఫస్ట్ రిఫరల్ యూనిట)లు జీవీఎంసీ నిర్వహణలోనే ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా 42 యూపీహెచ్సీలను అందుబాటులోకి తీసుకొస్తుండటంతో ఎఫ్ఆర్యూలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నా, గత సంవత్సరం నిర్వహణ ఛార్జీలను ఈ ఏడాది పొందుపరచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఎనిమిది మందికి ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి అంశాన్నీ చేర్చారు. జీవీఎంసీకి చెందిన 10 పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు తీసుకొచ్చేలా అవసరమైన రూ.5 లక్షల వ్యయం చేసేలా పాలకవర్గం దృష్టికి తీసుకురానున్నారు. వార్డు సచివాలయాలకు రూ.57.92 లక్షలతో ఏడాది పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి, రూ.9 కోట్ల వ్యయంతో ముడసర్లోవ పరిసరాల పరిరక్షణకు రక్షణ గోడ నిర్మాణాన్ని పొందుపరిచారు. ఎండాడలో కాపు భవనం, ఏపీఐఐసీ ద్వారా ఆసుపత్రి నిర్మాణానికి స్థల కేటాయింపు చేసిన ప్రతిపాదనలూ ఇందులో ఉన్నాయి. తెలుపు రేషన్కార్డుదారుల నుంచి చెత్త సేకరణ సేవా రుసుము రూ.60 వసూలకు ప్రతిపాదన చేశారు. గతంలో వివాదాస్పదంగా మారిన చెత్త తరలింపు కేంద్రాలలో సీసీఎస్ (క్లోజ్డ్ కాంపాక్షన్ సిస్టం) నిర్వహణ, వాహనాల మరమ్మతులూ ఇందులో ఉన్నాయి.
మరోసారి తిత్లీ పంచాయితీ: 2018లో తిత్లీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలలో నీటి సరఫరా చేయడానికి రూ.72.65 లక్షలు వెచ్చించినట్లు మంచినీటి సరఫరా ఇంజినీర్లు ప్రతిపాదనలు సమర్పించారు. గతంలో ఈ అంశాన్ని సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. మళ్లీ ఈ సమావేశంలో ఆ అంశాన్ని ఆమోదించేలా అధికార పక్ష కార్పొరేటర్లకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దీని వెనుక ఏం జరిగిందనే అంశంపై చర్చనీయాంశమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్