భవన యజమానుల గగ్గోలు
మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) పరిధిలోని పలు ప్రైవేటు భవనాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాలకు ప్రతి నెలా అద్దె చెల్లించడం లేదు. బకాయిలు దాదాపు రూ.3.33 కోట్లకు చేరాయి.చెల్లించాలని
సచివాలయాల అద్దె బకాయిలు రూ.3.33 కోట్లు
వార్డు సచివాలయ భవనం
కార్పొరేషన్, న్యూస్టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) పరిధిలోని పలు ప్రైవేటు భవనాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాలకు ప్రతి నెలా అద్దె చెల్లించడం లేదు. బకాయిలు దాదాపు రూ.3.33 కోట్లకు చేరాయి.చెల్లించాలని భవనాల యజమానులు అనేక సార్లు జీవీఎంసీˆకి వినతులు సమర్పించగా...మూడు నెలల మొత్తం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఆయా భవనాలకు జీవీఎంసీˆ చెల్లించిన అద్దె నిధులు నేటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో సాధారణ నిధుల నుంచే ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
ఏడాదిగా ఇంతే: జీవీఎంసీ పరిధిలో 578 వార్డు సచివాలయాలున్నాయి. విశాఖ జిల్లాలో 545, అనకాపల్లి జిల్లాలో మరో 33 సచివాలయాలున్నాయి. మొత్తంగా 189 భవనాలను అద్దెకు తీసుకుని వాటిలో కొన్ని ఏర్పాటు చేశారు. మిగిలిన వాటికి జీవీఎంసీˆకి చెందిన వార్డు కార్యాలయాలు, సామాజిక భవనాలు, అంగన్వాడీ కేంద్రాలలో ఏర్పాటు చేశారు. అద్దె భవనాలకు మాత్రం చదరపు అడుగుకు అద్దె రూ.15లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క భవనానికి రూ.23వేలు నుంచి రూ.28 వేలు వరకు విస్తీర్ణం ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది మే నెల వరకు అద్దె చెల్లించిన జీవీఎంసీˆ తరువాత వాటిపై దృష్టి కేంద్రీకరించలేదు. యజమానుల నుంచి విజ్ఞప్తులు రావడంతో కమిషనర్ లక్ష్మీశ మూడు నెలల అద్దె రూ. 83.25 లక్షలు చెల్లించడానికి దస్త్రాన్ని తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల క్రితం వార్డు సచివాలయాల బాధ్యతలను చూస్తున్న జీవీఎంసీˆ కార్యదర్శి ఎంవీడీ ఫణిరాం జోనల్ కార్యాలయాలకు లేఖలు రాశారు. జోన్లో ఉన్న ప్రయివేటు భవనాల వివరాలు, వారికి చెల్లించాల్సిన అద్దె వివరాలు తెలియజేయాలని కోరారు. ఇప్పటి వరకు రెండు జోన్ల నుంచి వివరాలు అందలేదు. వాటన్నింటినీ క్రోడీకరించి మూడు నెలల బకాయిలు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తరువాత మరో మూడు నెలలవి చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
భారం జీవీఎంసీపైనే: వార్డు సచివాలయాల నిర్వహణ భారం జీవీఎంసీˆపై పడుతోంది. 2019 అక్టోబరులో ఏర్పాటు తరువాత ఏటా రూ.3.33 కోట్లు జీవీఎంసీˆ సొంత నిధులనే అద్దెకు చెల్లిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలేదు. భవనాలు అద్దెకిచ్చిన యజమానులు ఖాళీ చేయాలని తరచూ వార్డు కార్యదర్శులను కోరుతుండటం కనిపిస్తుంది. ప్రతి నెలా అద్దె చెల్లించాలంటున్నారు. 12 నెలల పాటు అద్దె ఇవ్వకపోతే భవనాల నిర్వహణ భారంగా మారుతుందని వివరిస్తున్నారు. తమ భవనాలను వాణిజ్య సముదాయాలకు అద్దెకు ఇస్తే ప్రతి నెలా అద్దె వచ్చేదన్న భావన యజమానుల్లో కనిపిస్తుంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలోనూ పలువురు ఈ అంశాన్ని నేతల వద్ద ప్రస్తావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి