కాలుష్య రహిత నగరంగా విశాఖ
రాష్ట్రంలో విశాఖ నగరం పెద్దది. ఇక్కడ ఏ రకమైన కాలుష్యం లేకుండా చూడాలి. 24 గంటలూ విద్యుత్తు సరఫరా ఉండాలి. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. ఆ దిశగా అధికారులు దృష్టిసారించాలి’ అని పర్యావరణ, విద్యుత్తు, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
పరిశ్రమల్లో తనిఖీలు చేయండి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
రాష్ట్రంలో విశాఖ నగరం పెద్దది. ఇక్కడ ఏ రకమైన కాలుష్యం లేకుండా చూడాలి. 24 గంటలూ విద్యుత్తు సరఫరా ఉండాలి. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. ఆ దిశగా అధికారులు దృష్టిసారించాలి’ అని పర్యావరణ, విద్యుత్తు, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో శనివారం అధికారులతో వివిధ శాఖలపై సమీక్షించారు.
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఎక్కువ కాలుష్యకారక పరిశ్రమలు విశాఖ నగరం చుట్టే ఉన్నాయని, వాటిని తరచూ తనిఖీ చేసి నిబంధనలు మీరిన వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. తాడి గ్రామాన్ని త్వరలో మరొక ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాక్టరీస్ అధికారులతో సమన్వయం ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. మాజీ మంత్రి ముత్తంశెట్టి స్పందిస్తూ పరిశ్రమలు సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం విరివిగా చేపట్టేలా చూడాలన్నారు. ఈ విషయంలో కొన్ని పరిశ్రమలు అస్సలు పట్టించుకోవడం లేదని దీనివల్లే కాలుష్యం పెరుగుతుందన్నారు.
తుది దశలో.. భూగర్భ విద్యుత్తు పనులు: తుపాను ప్రభావిత ప్రాంతాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్తు ప్రాజెక్టు పనులకు రూ.1,165 కోట్లు మంజూరైనట్లు ఈపీడీసీఎల్ సీఎండీ సంతోషరావు తెలిపారు. ఇప్పటికే 130 కిలోమీటర్ల పరిధిలో 80 శాతం పూర్తిచేసినట్లు తెలిపారు. గ్రిడ్ డైరెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ లోయర్ సీలేరు ప్రాజెక్టుకు అటవీశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు .అనంతరం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సం సందర్భంగా రూపొందించిన గోడపత్రికను మంత్రి పెద్దిరెడ్డి, తదితరులు ఆవిష్కరించారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కలెక్టర్ మల్లికార్జున, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జంతు ప్రదర్శనశాల తరలించేస్తే..
అటవీశాఖ ప్రగతిపై సమీక్షిస్తున్న క్రమంలో ‘జూ’ తరలించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలనే వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
అధికారులు: ‘జూ’కు వస్తున్న సందర్శకులతో ఏటా రూ.4 నుంచి 5 కోట్ల ఆదాయం వస్తుంది. అదే సమయంలో అన్ని ఖర్చులు కలిపి రూ.10 కోట్లు అవుతున్నాయి. ఆదాయం పెంచుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాం.
మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి: నేను రెండు సూచనలు చేస్తా. 1. జూ ఉన్న ప్రాంతం నగరానికి గుండెకాయలాంటిది.. అక్కడి నుంచి వేరేచోటకు తరలిస్తే మీకు అంతకంటే ఎక్కువ స్థలమే కలెక్టర్ ఇస్తారు. ఈ భూములు అభివృద్ది చేసుకోవచ్చు. 2. జూ తరలించకపోతే సింగపూర్లో మాదిరిగా ‘నైట్ సఫారీ’ దిశగా అభివృద్ధి చేస్తే మంచి ఆదాయం వస్తుంది.
క్యూరేటర్ నందనీ సలారియా: ‘నైట్ సఫారీ’ అంటే మాకు తగినంత బడ్జెట్ ఇవ్వాలి. జూ తరలింపుపై మంత్రి పెద్దిరెడ్డిని విలేకర్లు ప్రశ్నించగా: ‘జూ’ను ఎక్కడికీ తరలించేది లేదు. మరింత అభివృద్ధి చేయడానికి తగినట్లు క్యూరేటర్ ప్రణాళికలు తయారుచేశారు. మిగతా రాష్ట్రాలు, దేశాల్లో అమలు చేసే అంశాలను పరిశీలించి ప్రపంచ స్థాయి జంతు ప్రదర్శనశాలగా మార్చడానికి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రవేశ రుసుం పెంచడానికి అవకాశాలను పరిశీలించాలి. జూ అభివృద్ధికి గతంలో రూ.230 కోట్ల ప్రతిపాదనలకు మంజూరు లభించగా రూ.137 కోట్లకు ఉత్తర్వులు కూడా జారీచేసినట్లు అధికారులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM