logo

బీసీలకు ఏం చేశారని బస్సు యాత్ర: తెదేపా

బీసీలకు ఏం చేశారని వైకాపా మంత్రులు బస్సు యాత్ర చేపడుతున్నారని తెదేపా బీసీ సెల్‌ విశాఖ జిల్లా అధ్యక్షులు తమ్మిన విజయ్‌ ప్రశ్నించారు.

Published : 22 May 2022 03:44 IST

వన్‌టౌన్, న్యూస్‌టుడే: బీసీలకు ఏం చేశారని వైకాపా మంత్రులు బస్సు యాత్ర చేపడుతున్నారని తెదేపా బీసీ సెల్‌ విశాఖ జిల్లా అధ్యక్షులు తమ్మిన విజయ్‌ ప్రశ్నించారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు రూ.వేల కోట్లు పంచామని చెబుతున్న సీఎం జగన్‌ వాస్తవానికి ఏమీ చేయలేదన్నారు. రెండేళ్లలో రూ.18,226 కోట్ల బీసీ నిధులు దారి మళ్లించారని విమర్శించారు. బీసీ నాయకులు అనసూరి మదు, నారాయణ మాట్లాడుతూ రెండు, మూడు పదవులు ఇచ్చినంత మాత్రాన బీసీల సాధికారికత సాధ్యం కాదని, క్షేత్రస్థాయిలో పలు పథకాలు పక్కాగా అమలు చేయాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు