Andhra news: రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ స్టే.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖ వద్ద రుషికొండ తవ్వకాలపై ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ప్రిన్సిపల్
అమరావతి: విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖ వద్ద రుషికొండ తవ్వకాలపై ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ప్రిన్సిపల్ ధర్మాసనం స్టే విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పర్యావరణ అనుమతులు అన్నీ పొందాకే తవ్వకాలు మొదలుపెట్టినట్లు పేర్కొంది. పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా తవ్వకాలు చేపడతామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 6న తేదీన ఎన్జీటీ బెంచ్ విచారణ చేసింది. విచారణ చేపట్టిన ఎన్జీటీ.. తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!