రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
ఓ ఈవెంట్లో న్యత్యం చేసేందుకు వెళ్తున్న భార్యాభర్తలు రోడ్డు ప్రమాదానికి గురవగా...భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో జాతీయ రహదారిపై అదపాక కూడలి సమీపంలో సోమవారం జరిగింది.
భార్యకు గాయాలు
లావేరు గ్రామీణం, న్యూస్టుడే: ఓ ఈవెంట్లో న్యత్యం చేసేందుకు వెళ్తున్న భార్యాభర్తలు రోడ్డు ప్రమాదానికి గురవగా...భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో జాతీయ రహదారిపై అదపాక కూడలి సమీపంలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. భార్యాభర్తలు వేణు, తిలోత్తమ వృత్తి రీత్యా డ్యాన్సర్లు. విశాఖ వాంబేకాలనీకి చెందిన వీరు ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వెళ్తున్న సమయంలో అదపాక కూడలి సమీపంలోని పైవంతెన వద్ద వాహనం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొంది. ఈ ఘటనలో వేణు(22) అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. తిలోత్తమను చికిత్స నిమిత్తం 108లో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. లావేరు ఎస్ఐ పి.సిద్ధార్థ్కుమార్, పెట్రోలింగ్ పోలీసులు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాసుపత్రికి తరలించారు. కళ్లముందే భర్త మృతి చెందడంతో తిలోత్తమ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్