పెట్రోలు సీసాతో స్పందన కొచ్చిన మహిళ
విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఓ మహిళ పెట్రోలు సీసాతో రావడం కలకలం సృష్టించింది. తనకు న్యాయం చేయకపోతే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.
విశాఖపట్నం (వన్టౌన్), న్యూస్టుడే: విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఓ మహిళ పెట్రోలు సీసాతో రావడం కలకలం సృష్టించింది. తనకు న్యాయం చేయకపోతే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. పోలీసులు వెంటనే స్పందించి ఆమె నుంచి పెట్రోలు సీసాను స్వాధీనం చేసుకుని, పోలీసు అధికారి బాబూజీతో మాట్లాడించారు. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆమె శాంతించారు. విశాఖ నగరం బుచ్చిరాజుపాలేనికి చెందిన బాధితురాలు మల్ల దేవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘2019లో నా కుమారుడు ఎం.శివసత్యనారాయణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఎయిర్పోర్టు పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశా. నిందితులపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అందులో వాస్తవం లేదు. నా కుమారుడు మౌనిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగా, కొద్ది రోజుల తర్వాత ఆమె మృతి చెందింది. దీనికి బాధ్యుడ్ని చేస్తూ నా కుమారుడ్ని ఎయిర్పోర్టు పోలీసులు తీసుకెళ్లారు. బంధువులైన అశోక్, సురేష్ అనే వ్యక్తులు జామీనుపై విడుదల చేయించి తమ ఇంట్లో ఉంచుకున్నారు. తర్వాత రోజే కుమారుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాన’ని మల్ల దేవి తెలిపారు. కుమారుడి ఫొటోతో ఆమె కొద్దిసేపు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. పోలీసులు ఇచ్చిన హామీతో వెనుదిరిగారు.
‘వీఎంఆర్డీఏ’లో 13 ఫిర్యాదులు
స్పందనలో పాల్గొన్న కలెక్టర్ మల్లికార్జున, వీఎంఆర్డీఏ ఛైర్పర్సన్ విజయనిర్మల
పెదవాల్తేరు, న్యూస్టుడే : వి.ఎం.ఆర్.డి.ఎ. భవనంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. వి.ఎం.ఆర్.డి.ఎ. ఛైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఇన్ఛార్జి కమిషనర్ పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి 13 వినతులు వచ్చినట్లు తెలిపారు. సెక్రటరీ రఘునాథరెడ్డి, జేసీ రవీంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
* కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనలో...ఎన్ఏడీ సమీపంలోని శాంతిపురంలో కమర్షియల్ ఫ్లాట్ ఇస్తానని ఓ బిల్డరు తన నుంచి రూ.1.05కోట్లు తీసుకొని రెసిడెన్షియల్ ఫ్లాటు అప్పగించారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఆ బిల్డర్కు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధి సహకరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కలెక్టర్మల్లికార్జునను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!