ఆ ‘స్టే’షన్లలో అంతే!!
విశాఖ పోలీసు కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ నగరంలోని కొన్ని పోలీసు స్టేషన్లను ఇటీవల తనిఖీ చేశారు. అలా వెళ్లిన పలు స్టేషన్లో కొన్ని పాత కేసులు పెండింగులో ఉన్నట్లు గుర్తించారు. కారణాలేమిటని ఆరా తీయగా... ఆసక్తికర అంశం గుర్తించారు.
20 ఏళ్లుగా పురోగతి లేని కేసులెన్నో
-ఈనాడు, విశాఖపట్నం
నగర పరిధిలో కొన్ని కీలక కేసుల్లో దర్యాప్తును పోలీసులు పక్కన పడేస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఇలా ఉంచేసిన కేసులూ ఉండటం గమనార్హం.
విశాఖ పోలీసు కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ నగరంలోని కొన్ని పోలీసు స్టేషన్లను ఇటీవల తనిఖీ చేశారు. అలా వెళ్లిన పలు స్టేషన్లో కొన్ని పాత కేసులు పెండింగులో ఉన్నట్లు గుర్తించారు. కారణాలేమిటని ఆరా తీయగా... ఆసక్తికర అంశం గుర్తించారు. న్యాయస్థానంలో ‘స్టే’ ఉన్నట్లు పోలీసులు తమ కంప్యూటర్లలో నమోదు చేసిన విషయం పరిశీలించారు. అలా ‘స్టే’ సాకుగా చూపి స్టేషన్ స్థాయిలో ఏ ఒక్క అధికారి కూడా ఆ కేసుల దర్యాప్తులు/విచారణల వైపు దృష్టిసారించకపోవడం గమనార్హం. మొత్తంగా 200 వరకు అలాంటి కేసులున్నట్లు అంచనా.
వదిలేశారలా: న్యాయస్థానం ఆదేశాలు ఏమైనా ఉంటే వాటి ప్రకారం పోలీసు అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఒక ప్రణాళిక రచించుకోవాలి. బాధితులకు న్యాయం దక్కేలా అన్ని రకాల చర్యలను చేపట్టాలి. అవసరమైతే పోలీసు న్యాయ సలహాదారులను సంప్రదించాలి. అందుకోసం ఒక న్యాయ నిపుణుడిని కూడా కమిషనరేట్ పరిధిలో అందుబాటులో ఉంచారు. పలువురు అధికారులు వారికి దృష్టికీ ఈ కేసుల అంశాలు తీసుకువెళ్లలేదని గుర్తించారు.
ఏళ్లుగా అదే కారణం: ఏదైనా కేసులో న్యాయస్థానం నుంచి ‘యథాతథ స్థితి(స్టే)’ అమలు చేయాలన్న స్టేషన్ స్థాయి అధికారులకు ఆదేశాలు వస్తే.... ఆ ఉత్తర్వులున్నాయంటూ ‘కట్.. కాపీ... పేస్ట్’ తరహాలో ప్రతిసారి అవే కారణాలను చూపుతూ ఏళ్ల తరబడి కాలం వెళ్లదీస్తున్నారు. సాధారణంగా న్యాయస్థానం ఆదేశాలున్నాయంటే పోలీసు ఉన్నతాధికారులు కూడా వాటి జోలికి వెళ్లరన్న అభిప్రాయంతో పలువురు ఎస్.హెచ్.ఒ.లు ఉన్నతాధికారులకు కూడా పూర్తిస్థాయి సమాచారం చెప్పడం లేదని తెలుస్తోంది. నిర్ణీతకాలం స్టే కొనసాగించాలని పేర్కొన్నప్పటికీ న్యాయస్థానికి తగిన కారణాలు చూపించి ‘స్టే’ తొలగింపు ఉత్తర్వులు తెచ్చుకోవచ్ఛు ఇందుకుగాను తగిన ఆధారాలు సేకరించి, సమగ్ర నివేదికను రూపొందించి న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదని తేలింది. ఫలితంగా పలు కేసులు, విచారణలు పూర్తికాని దుస్థితి నెలకొంది.
నెలరోజులు సమయం ఇచ్చాం...
కమిషనరేట్ పరిధిలో 20 ఏళ్ల నుంచి కొన్ని కేసులు పెండింగులో ఉన్న విషయం వాస్తవమే. ఆ పరిస్థితికి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పాం. 2015 సంవత్సరానికి ముందు నాటి అన్ని కేసుల దర్యాప్తులు, విచారణలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. పర్యవేక్షక అధికారులు కూడా ఆ విషయాలను పట్టించుకోలేదని గుర్తించాం. ప్రతి ఒక్క అధికారి ‘పోలీసు మాన్యువల్’ ప్రకారం బాధ్యతలను నిర్వర్తించాల్సిందే.
-సీహెచ్.శ్రీకాంత్, సీపీ, విశాఖపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.