నేడు, రేపు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
నగరంలో వైకాపా తలపెట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర సందర్భంగా యాత్ర సాగే రహదారుల్లో ప్రయాణించేవారంతా ఈ నెల 26, 27 తేదీల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
ఎం.వి.పి.కాలనీ, న్యూస్టుడే: నగరంలో వైకాపా తలపెట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర సందర్భంగా యాత్ర సాగే రహదారుల్లో ప్రయాణించేవారంతా ఈ నెల 26, 27 తేదీల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
* ఈ నెల 26న బస్సుయాత్ర విజయనగరం నుంచి విశాఖ జిల్లాలోకి చేరుకుంటుంది. రాత్రి 7 నుంచి 10 గంటల మధ్యలో రాజపులోవ నుంచి తగరపువలస, మధురవాడ, ఎండాడ, హనుమంతువాక, మద్దిలపాలెం, టైకూన్, సిరిపురం కూడళ్ల మీదుగా సాగనున్నందున ఆయా ప్రాంతాల మీదుగా ప్రయాణించే సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు బుధవారం వెల్లడించారు.
* ఈనెల 27న ఉదయం 8 నుంచి 11 గంటల సిరిపురం నుంచి బయలుదేరి తెలుగుతల్లి ఫ్లైఓవర్, తాటిచెట్లపాలెం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, గాజువాకమీదుగా అనకాపల్లి వైపు యాత్ర సాగుతుందన్నారు.
* గాజువాక కూడలి రద్దీగా మారే అవకాశం ఉండటంతో మల్కాపురం నుంచి గాజువాక మీదుగా అనకాపల్లి వెళ్లే వాహనాలు మల్కాపురం నుంచి కొత్త గాజువాక చేరుకుని, మార్కెట్, కణితి రోడ్డు మీదుగా వంటిల్లు, జగ్గు కూడలి మీదుగా 100 అడుగుల రోడ్డు కూడలికి చేరుకుని అనకాపల్లి వైపు వెళ్లాలని కోరారు.
* మల్కాపురం నుంచి గాజువాక మీదుగా షీలానగర్ వైపు వెళ్లే వాహనదారులు కొత్తగాజువాక వద్ద హైస్కూలు రోడ్డు మీదుగా ప్రయాణించి పంతులుగారి మేడ వద్ద సర్వీసురోడ్డుకు చేరుకుని, ‘ఏపీ ట్రాన్స్కో’ భవనం నుంచి షీలానగర్ వైపు ప్రయాణించాల్సిందిగా కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!