YSRCP: వైకాపా అధికారంలోకి వచ్చాకే సామాజిక న్యాయం: రెండో రోజు బస్సు యాత్రలో మంత్రులు

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపానే గెలిపించాలని ఏపీ మంత్రులు కోరారు. విశాఖపట్నం నగరంలోని పాత గాజువాక జంక్షన్‌ నుంచి రెండో రోజు బస్సు యాత్రను ప్రారంభించారు.

Updated : 27 May 2022 15:02 IST

గాజువాక: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపానే గెలిపించాలని ఏపీ మంత్రులు కోరారు. విశాఖపట్నం నగరంలోని పాత గాజువాక జంక్షన్‌ నుంచి రెండో రోజు బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాజువాకలో నిర్వహించిన సభలో మంత్రులు, వైకాపా నేతలు మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చాకే సామాజిక న్యాయం అమలవుతోందని చెప్పారు.

రాష్ట్రంలో అన్ని వర్గాలు, కులాలకు ఏ ప్రభుత్వం అందించనంత అవకాశాలను సీఎం జగన్‌ అదించారని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఏపీలో జరిగినంత రాజకీయ సాధికారత దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగలేదని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. గతంలో ఆదరించినట్లే రాబోయే ఎన్నికల్లోనూ జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని