రాష్ట్రస్థాయి మహిళల ఫుట్బాల్ పోటీలు ప్రారంభం
రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల ఫుట్బాల్ పోటీలు నగరంలోని పోర్టు స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎ.పి.ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
పోటీలను ప్రారంభిస్తున్న ఎ.పి.ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ
విశాఖ క్రీడలు, న్యూస్టుడే: రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల ఫుట్బాల్ పోటీలు నగరంలోని పోర్టు స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎ.పి.ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారిణులనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో తొలిసారిగా మహిళలకు పోటీలు జరుగుతుండడం సంతోషంగా ఉందన్నారు. ప్రారంభపు మ్యాచ్లో కడప జిల్లా జట్టు 11-0 గోల్స్ తేడాతో కృష్ణా జట్టుపై, చిత్తూరు 4-1తో పశ్చిమగోదావరి జట్టుపై, కర్నూలు 4-0తో విశాఖపై, చిత్తూరు 5-0తో నెల్లూరుపై విజయాలు సాధించాయి. గుంటూరు, తూర్పుగోదావరి జట్ల మధ్య మ్యాచ్ టై అయ్యింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎ.పి.ఫుట్బాల్ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్.నాగేశ్వరరావు, ప్రతినిధులు ప్రసాద్, దీపక్, జిల్లా ఫుట్బాల్ సంఘం ఉపాధ్యక్షులు ఎ.జగనాధరావు, హెచ్.ఎం.పాత్రో, శివప్రసాద్, కోశాధికారి ధనరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా