మద్యం తాగడానికి పిలిచి చంపేశారు
చిన్న చిన్న గొడవల కారణంగా విడిపోయిన స్నేహితులు కక్షలు పెంచుకొని అదును చూసి ఓ స్నేహితుడ్ని కర్కశంగా చంపేశారు. నగరంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటన మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వద్ద ఈ సంఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ
మర్రిపాలెంలో యువకుడిపై కర్కశ దాడి
మాధవధార, న్యూస్టుడే
చిన్న చిన్న గొడవల కారణంగా విడిపోయిన స్నేహితులు కక్షలు పెంచుకొని అదును చూసి ఓ స్నేహితుడ్ని కర్కశంగా చంపేశారు. నగరంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటన మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వద్ద ఈ సంఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 51వ వార్డు గాంధీనగర్ ప్రాంతానికి చెందిన రేబాక సాయితేజ (22) ఫొటోగ్రఫీ చేస్తుంటాడు. ఇదే ప్రాంతంలోని మహత్కాలనీకి చెందిన అతడి స్నేహితుడు మోహన్ గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో ఫోన్ చేసి, రైల్వే క్వార్టర్స్ గ్రౌండ్స్ వద్ద పాత స్నేహితులు ఉన్నారని, మద్యం తాగుదాం రమ్మని పిలిచాడు. దీంతో తేజ మరో ముగ్గురు స్నేహితులతో వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో ఉన్న గ్రీన్గార్డెన్స్కు చెందిన బంగారు రాజు బ్యాచ్కు, తేజకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో బంగారు రాజు బ్యాచ్కు సంబంధించిన యువకులు కత్తులు, రాడ్లు, కర్రలతో తేజపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు అతడు రైల్వే క్వార్టర్స్ వైపు పరుగులు తీశాడు. క్వార్టర్స్ పైకి వెళ్లిన అతడిని కిందకు తీసుకువచ్చి కొబ్బరిబొండాలు కొట్టే కత్తితో తలపై, వీపుపై నరుకుతూ, రాడ్లతో కొట్టడంతో మళ్లీ పరుగెత్తాడు. అతడిని వెంబడించి రైల్వేక్వార్టర్స్ నీటి ట్యాంకర్ వద్ద కొట్టి చంపేశారు.
చంపేసి.. తప్పుదోవ పట్టించేలా: హత్య అనంతరం నిందితులు తమకేమీ తెలియదన్నట్లుగా.. తేజ తన స్నేహితులతో కలసి తమపై దాడికి పాల్పడ్డాడంటూ అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ఎయిర్పోర్టు స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో నిందితులైన బంగారురాజు, రవి, మరో ముగ్గురు ఉన్నారు. వీరంతా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఇలా స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. స్టేషన్లో ఫిర్యాదు తీసుకున్న కానిస్టేబుల్ తెల్లవారాక వచ్చి విచారిస్తామని చెప్పడంతో వెళ్లిపోయారు.
పోలీసుల పరిశీలన: శుక్రవారం తెల్లవారుజామున క్వార్టర్స్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ఆడుకునేందుకు వచ్చిన పలువురు యువకులు అచేతనంగా పడిఉన్న తేజను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్పోర్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి, హత్యకు గల కారణాలను నమోదు చేశారు. క్రైం ఏసీపీ పెంటారావు, ఎయిర్పోర్టు సీఐ ఉమాకాంత్తో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆ ప్రాంతానికి చేరుకొని పలు ఆధారాలను సేకరించింది.
ముందుగానే హెచ్చరించి: వారం రోజుల క్రితం తేజ స్నేహితుడు ఒకరు బిర్లాకూడలి వద్ద ప్రమాదంలో గాయాలపాలై నాలుగు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించాడు. అతడి అంతిమయాత్ర సమయంలో తేజకు, మిగతా యువకులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ సమయంలోనే... ‘నెల రోజుల్లో నిన్ను చంపేస్తామం’టూ తేజను వారు హెచ్చరించారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో అప్పటి నుంచి సమయం కోసం వేచి చూసి, స్నేహితుడితో ఫోన్ చేయించి రప్పించి హత్య చేశారని ఆరోపించారు.
ఇది వారి పనే: రైల్వే క్వార్టర్స్కి ఆనుకొని ఉన్న గ్రీన్గార్డెన్స్కు చెందిన బంగారు రాజు అనే వ్యక్తి జీవీఎంసీలో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తుంటాడు. ఇతనిపై దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. ఇతడి బ్యాచ్కి, తేజకు గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతుండటంతో వారే హత్య చేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రాథమికంగా హత్య వారి పనేనని పోలీసులు తేల్చి 10 మందిపై కేసు నమోదు చేశారు. హత్యకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ టీవీలో నమోదవడంతో దాని ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. బంగారురాజు, రవి, మోహన్, యూసఫ్ ఖాన్, సురేష్, నాని, బాలు, హరి.. మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృత దేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.
స్థానికుల్లో అలజడి: అర్థరాత్రి సమయంలో యువకులు కేకలు వేస్తూ.. కత్తులు, రాడ్లతో క్వార్టర్స్లో అలజడి సృష్టించి హత్య చేయడంతో స్థానిక నివాసితులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రాంగణంలోని మైదానంలో ప్రతి రోజు ఆకతాయిలు మద్యం, గంజాయి తాగుతూ గొడవలు చేస్తున్నారని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.