logo

‘మహానాడు’లో జిల్లా నేతల సందడి

మహానాడులో జిల్లా తెదేపా నేతలు తొలిరోజు శుక్రవారం సందడి చేశారు. జిల్లాకు సంబంధించి ఏర్పాటు చేసిన కౌంటర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, ఎమ్మెల్యేలు పేర్లు నమోదు చేసుకున్నారు. జిల్లాలోని ముఖ్య నేతలెవరికీ

Published : 28 May 2022 04:14 IST

మహానాడుకు హాజరైన పీలా గోవిందు సత్యనారాయణ, గణబాబు, బండారు, పల్లా శ్రీనివాసరావు తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: మహానాడులో జిల్లా తెదేపా నేతలు తొలిరోజు శుక్రవారం సందడి చేశారు. జిల్లాకు సంబంధించి ఏర్పాటు చేసిన కౌంటర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, ఎమ్మెల్యేలు పేర్లు నమోదు చేసుకున్నారు. జిల్లాలోని ముఖ్య నేతలెవరికీ మహానాడులో ప్రతిపాదిత అంశాలపై మాట్లాడే అవకాశం రాలేదు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ నజీర్‌కు మాత్రం మైనార్టీలకు సంబంధించిన అంశంపై మాట్లాడే అవకాశం దక్కింది.

పేరు నమోదు చేసుకుంటున్న ఎమ్మెల్యే వెలగపూడి

విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, నియోజకవర్గ బాధ్యులు గండిబాబ్జీ, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవిందు సత్యనారాయణ, పార్టీ నాయకులు మళ్ల సురేంద్ర తదితరులు మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల నేతలు హాజరయ్యారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు యువత విభాగ ప్రధాన కార్యదర్శి మొల్లిపెంటిరాజు రక్తదాన శిబిరంలో వాలంటీరుగా సేవలందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని