అటు యాత్ర.. ఇటు యాతన!
విశాఖ నగరంలోని ఎన్ఏడీ కూడలి నుంచి గాజువాక వరకూ శుక్రవారం ఉదయం పలువురు ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గాజువాక ప్రాంతం ఆంక్షల గుప్పిట్లో చిక్కుకుంది. వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’ సందర్భంగా పాతగాజువాక కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దుకాణాలు తెరవకూడదని ముందుగానే స్పష్టం చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టం
ఆంక్షల గుప్పిట్లో గాజువాక
సభలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు, వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు
గాజువాక, న్యూస్టుడే: విశాఖ నగరంలోని ఎన్ఏడీ కూడలి నుంచి గాజువాక వరకూ శుక్రవారం ఉదయం పలువురు ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గాజువాక ప్రాంతం ఆంక్షల గుప్పిట్లో చిక్కుకుంది. వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’ సందర్భంగా పాతగాజువాక కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దుకాణాలు తెరవకూడదని ముందుగానే స్పష్టం చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టం చేశారు. కేవలం సభా వేదిక ముందు ఏర్పాటు చేసిన కుర్చీల వైపు వచ్చే వారినే అనుమతించారు. తెల్లవారుజాము నుంచి సభ ముగిసే వరకూ ఆంక్షలు అమలు చేయడంతో ఈ ప్రాంత ప్రజలు సరికొత్త కష్టాలను ఎదుర్కొన్నారు.
కణితిరోడ్డు వంటిల్లు కూడలిలో ఏర్పాటు చేసిన బారికేడ్లు
ట్రాఫిక్లో చిక్కుకున్న తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి కారు
* కొత్తగాజువాక, సినిమాహాలు కూడలి, పాతగాజువాక కూడళ్లలో బారికేడ్లు, పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి ఎవర్నీ అనుమతించలేదు. కణితిరోడ్డు వంటిల్లు కూడలి, పాతగాజువాక పంతులుగారి మేడ వద్ద సీఐ స్థాయి అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు పాత గాజువాక వుడారోడ్డులో బహిరంగ సభ ప్రారంభమైనా, తెల్లవారు జాము నుంచే అన్ని రహదారులను మూసేశారు. ప్రజలు కాలనీ అంతర్గతమార్గాల్లోనుంచి ప్రధాన రహదారుల్లోకి చేరుకోవాల్సి వచ్చింది.
* గాజువాకతో పాటు, ఎన్ఏడీకూడలిలో ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో ఇటు సింధియా మీదుగా నగరంలోకి వెళ్లాల్సిన ప్రయాణికులు, అటు కూర్మన్నపాలెం నుంచి అనకాపల్లి, రాజమహేంద్రవరం వెళ్లే ప్రయాణికులు దాదాపు మూడు, నాలుగు గంటల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సభలో పాల్గొనేందుకు వచ్చిన తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఎన్ఏడీకూడలి పైవంతెన వద్ద ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఆ తర్వాత వాహనాలను క్రమబద్ధీకరించడంతో సభాస్థలికి చేరుకున్నారు.
* జీవీఎంసీ యూసీడీ విభాగం అధికారులు, వైకాపా కార్పొరేటర్లు, నాయకుల సమన్వయంతో ఎక్కడికక్కడ మినీ బస్సులు, ఆటోలు ఏర్పాటు చేసి డ్వాక్రా గ్రూపు సభ్యులను స్థానిక లంకా మైదానానికి తరలించారు. అక్కడ వాహనాల్లోంచి దించేసి సభాస్థలికి వరకు నడిపించారు. తిరుగు ప్రయాణంలో తమను తీసుకువెళ్లేందుకు సరిగా ఏర్పాట్లు చేయలేదని పలువురు మహిళలు ఇక్కడ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బస్సులో వస్తున్న మహిళా సంఘాల సభ్యులు
* గాజువాకలో జరిగిన సభకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అధ్యక్షత వహించారు. స్పీకర్ సీతారాం, ఉపముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, అంజాద్బాషా, మంత్రులు విడదల రజని, వనిత మాట్లాడారు. కార్యక్రమానికి మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు, మేయర్ హరివెంకటకుమారి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయాన్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రజలందరికీ వివరించడమే బస్సుయాత్ర ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!