కౌలు రైతుకు హక్కుల చిక్కు
ఈయన పేరు కాండ్రేగుల కోటిబాబు. మునగపాక మండలంలో 1.5 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కౌలురైతు గుర్తింపు కార్డు మాత్రం పొందలేకపోయాడు. గతంలో సహాకార సంఘంలో నేరుగా డబ్బులు చెల్లించి విత్తనాలు తెచ్చుకునేవాడు..
గుర్తింపు కార్డులకు దూరం.. అందని సర్కారు సాయం
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, న్యూస్టుడే, అనకాపల్లి
ఈయన పేరు కాండ్రేగుల కోటిబాబు. మునగపాక మండలంలో 1.5 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కౌలురైతు గుర్తింపు కార్డు మాత్రం పొందలేకపోయాడు. గతంలో సహాకార సంఘంలో నేరుగా డబ్బులు చెల్లించి విత్తనాలు తెచ్చుకునేవాడు.. ఇప్పడు రైతుభరోసా కేంద్రంలో ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. ఈయన వద్ద పట్టాదారు పాసుపుస్తకం లేదు.. కౌలు గుర్తింపు కార్డు లేదు. దీంతో విత్తనాలే కాదు ప్రభుత్వపరంగా ఏ సాయం కూడా అందడం లేదు.
ఈయన పేరు బుద్ద దాసు. 12 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని తీపి మొక్కజొన్న, వరి, టమోటా, ఆనప వంటి కూరగాయల పంటలను సాగు చేస్తున్నాడు. ఈయనకు కౌలు రైతుగా ఎటువంటి గుర్తింపు కార్డు లేదు. ఇలాంటి కార్డు ఒకటి ఇస్తారనే విషయమే ఈయనకు తెలీదు. అందరూ రాయితీ విత్తనాలు తెచ్చుకుంటే నేను మాత్రం ప్రైవేటు డీలర్ల వద్ద అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నాడు..
మునగపాకలో రైతులతో మాట్లాడుతున్న రైతు స్వరాజ్యవేదిక సభ్యులు
ప్రస్తుతం పంటల సాగులో కౌలు రైతులే ముఖ్యభూమిక పోషిస్తున్నారు. చిన్న చిన్న కమతాలు సాగుకు గిట్టుబాటు కాక రైతులు కౌలుకిచ్చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 31 వేల మంది కౌలు రైతులు ఉంటారని వ్యవసాయ శాఖ అంచనా. వీరికి గతంలో విత్తనాల సరఫరా నుంచి పంటల కొనుగోలు వరకు ఎలాంటి బంధనాలు ఉండేవి కావు.. నేరుగా వెళ్లి రాయితీ విత్తనాలు తెచ్చుకునేవారు.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్ముకునేవారు. గత మూడేళ్లుగా కౌలుదారుల గుర్తింపు మొదలుకొని వారికి అందించాల్సిన సాయం వరకు అన్నింటా నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వారికి సాగుపరంగానే కాదు.. సర్కారు సాయం పరంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విసిగిపోయి వీరూ కాడి వదిలేసే పరిస్థితి వస్తోంది.
కొత్తచట్టం అమలు వల్లే..
రాష్ట్ర ప్రభుత్వం 2019లో కౌలు రైతులకు తీసుకువచ్చిన కొత్త చట్టంతో అనేక చిక్కులు ఏర్పడ్డాయి. భూ యజమాని ఆధార్, సంతకం ఉంటేనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చట్టంలో పేర్కొన్నారు. దీనివల్ల 95 శాతం మంది కౌలు రైతులకు పంటల సాగుదారు హక్కుల కార్డులు (సీసీఆర్సీ) నోచుకోలేకపోతున్నారు. గతంలో ఈ నిబంధన ఉండేది కాదు. కౌలుకు చేస్తున్నట్లు దరఖాస్తు చేస్తే వీఆర్వో ధ్రువీకరించి ఎల్ఈసీ కార్డులు ఇచ్చేవారు. ప్రస్తుత చట్టంలో భూయజమాని సమ్మతి తప్పనిసరి చేయడంతో ఎవరూ కౌలు గుర్తింపు కార్డులకు నోచుకోలేకపోతున్నారు.
అంచనాలు తారుమారు..
జిల్లాలో 2015లో 40 వేల మంది కౌలు రైతులున్నట్లు రెవెన్యూ శాఖ అంచనా వేసింది. 2021కి వచ్చేసరికి 31,802 మంది ఉంటారని అంచనా వేసిన వ్యవసాయ శాఖ సీసీఆర్సీ కార్డులను మాత్రం 7,500 మందికే ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాదికి వచ్చేసరికి 4,115 మంది మాత్రమే కౌలు రైతులున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. పోనీ వారికైనా సీసీఆర్సీ కార్డులు ఇచ్చారంటే కేవలం 546 మందికే ఇచ్చారు. ఇలా నిబంధనల పేరుతో కౌలు రైతుల గుర్తింపులోనూ కోతపెడుతున్నారు.
అన్ని విధాల నష్టపోతున్నారు..
కౌలు రైతుల పరిస్థితిపై మేం రైతు స్వరాజ్య వేదిక తరఫున రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టాం. అందులో బుచ్చెయ్యపేట, మునగపాక మండలాల్లో పర్యటించి కౌలు రైతులతో మాట్లాడాం. ఈ చట్టం గురించి చాలామందికి తెలియదు. దీనిపై రెవెన్యూ, వ్యవసాయ శాఖలు అవగాహన కల్పించాల్సి ఉంది. కార్డు లేకపోవడంతో ఫలితంగా కౌలు రైతులకు రైతు భరోసా డబ్బు రావడం లేదు. బీమా చేయకపోవడంతో అతివృష్టి, అనావృష్టి సమయాల్లో పరిహారం అందడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఈ-క్రాప్ నమోదు లేక పంటను అమ్ముకోలేకపోతున్నారు. విత్తనాలు, ఎరువులు అందడం లేదు. ఇలా అన్ని రకాలుగా కౌలు రైతులు నష్టపోతున్నట్లు గుర్తించాం. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం
-గాడి బాలు, రైతు స్వరాజ్య వేదిక, సహ సమన్వరకర్త
చైతన్యం చేస్తున్నాం
కొంతమంది భూయజమానులు అపోహల్లో ఉన్నారు. కౌలుకు భూమి ఇచ్చినట్లు వివరాలు ఇవ్వడం వల్ల వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే కౌలు రైతుల చట్టంపై తరచూ అవగాహన కలిగిస్తున్నాం. కొత్త చట్టం వలన కౌలు రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న అన్ని రకాల సౌకర్యాలు వీరికి అందుతాయి. లక్ష్యం చేరడానికి కృషి చేస్తున్నాం.
- లీలావతి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ