ఎండల్లో మంట.. అలవెన్స్ల్లో కోత
అచ్యుతాపురం, న్యూస్టుడే: మండుటెండల్లో బతకు బండిని లాగే ఉపాధి కూలీల వేతనాలకు కోతపడింది. ఒకపూట పనిచేస్తే అందే కూలీ డబ్బులు ఇప్పుడు రెండుపూటలూ చేస్తే తప్ప అందే పరిస్థితి కనిపించడంలేదని వీరంతా వాపోతున్నారు.
చెరువు తవ్వకం పనుల్లో కూలీలు
అచ్యుతాపురం, న్యూస్టుడే: మండుటెండల్లో బతకు బండిని లాగే ఉపాధి కూలీల వేతనాలకు కోతపడింది. ఒకపూట పనిచేస్తే అందే కూలీ డబ్బులు ఇప్పుడు రెండుపూటలూ చేస్తే తప్ప అందే పరిస్థితి కనిపించడంలేదని వీరంతా వాపోతున్నారు.
జిల్లాలో ప్రతిరోజు 1.50లక్షల మంది కూలీలు ఉపాధి పనులు పనిచేస్తున్నారు. అచ్యుతాపురం మండలంలో 1600 మంది, రాంబిల్లిలో మూడు వేల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వేసవి కావడం, వ్యవసాయ పనులు లేకపోవడంతో ఎక్కువమంది ఉపాధి కూలీ పనులకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు పూటలు పనిచేయాలనే కొత్త నిబంధన తీసుకురావడంతో మండుటెండల్లో వీరంతా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 11 గంటల్లోగా ఒకటి, సాయంత్రం అయిదు గంటల్లోగా మరో ఫొటో తీసి ఉపాధి హామీ పథకం యాప్లో అప్లోడ్ చేసేలా నిబంధనలు సవరించారు. వంద రోజులు పని పూర్తిచేసిన కూలీలకు ఉచితంగా అందించే పలుగు, పారలు ఇవ్వడంలేదు. టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో కూలీలు సేదతీరే అవకాశం లేకుండా పోతోంది. గతంలో 10మంది కలిసి పనిచేసినా వేతనాలు అందించేలా ఉండే నిబంధనలు ఇప్పుడు 50మంది తప్పనిసరిగా ఉండేలా మార్చారు. మార్చి నుంచి జూన్ వరకు ఉపాధి కూలీలకు వేసవి భత్యం అందించేవారు. దీన్ని ఎత్తివేయడంతో అదనపు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు.
ఆడిట్ జరగని పనులు పక్కనపెట్టారు...
కొవిడ్ వల్ల రెండేళ్లుగా ఉపాధి పనులపై సామాజిక తనిఖీ చేపట్టలేదు. ఆడిట్ జరగని పనులు మళ్లీ చేస్తే ఈ ఏడాది జరిగే సామాజిక తనిఖీల్లో ఒకే పని రెండుసార్లు చేసినట్లు కనిపించే అవకాశం ఉంది. ఉపాధి అధికారులు గ్రామాలకు దూరంగా ఉండే పనులను గుర్తించి వాటిని చేపడుతున్నారు. అయిదు కిలోమీటర్లు దాటి ప్రయాణం చేస్తే చెల్లించాల్సిన రవాణా ఛార్జీలు సైతం ఈ ఏడాది నుంచి చెల్లించడంలేదని కూలీలు వాపోతున్నారు.
ఏడాదికి 200 రోజుల పని కల్పించాలి....
కొవిడ్ మూలంగా ప్రజలకు అన్నిరకాలైన ఉపాధి దూరమైంది. ఎక్కువమంది పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏడాదికి 200రోజులు చేస్తే అందరికీ ప్రయోజనం. గతంలో ఆడిట్ జరగని పనులు సైతం ఇప్పుడు పనులు చేపట్టాలి. వేసవి అలవెన్స్లు, రవాణా ఛార్జీలు, అందించి ఆదుకోవాలి.
-రొంగలి రాము, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, అచ్యుతాపురం.
రెండుపూటల పని కూలీలకే లాభం.....
ఉపాధి హామీ పథకంలో రెండు పూటలు పని వల్ల కూలీలకే అదనపు లాభం. కొవిడ్కు ముందు 100 రోజులు పనిచేసిన కూలీలకు పరికరాలు అందించేవారు. రెండేళ్లగా ఎవరికి ఇవి ఇవ్వడంలేదు. తాగునీరు అలవెన్స్ కూలీల ఖాతాల్లో రోజుకి రూ.అయిదు చొప్పున వేస్తున్నాం. గతంలో అందించిన టెంట్లు చాలావరకు చిరిగిపోవడంతో కొంత ఇబ్బంది వచ్చింది. సగటున రూ.220వరకు కూలీగిట్టుబాటు అవుతోంది.
-శ్రీనివాస్, ఏపీఓ, జాతీయ ఉపాధిహామీ పథకం పథకం, అచ్యుతాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.