బదిలీలకు పైరవీలు
సాధారణ బదిలీలకు గడువు సమీపిస్తుండడంతో ఉద్యోగులు తమకు నచ్చిన చోటకు వెళ్లడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. విద్య, వైద్యారోగ్య శాఖలు మినహా మిగతా శాఖలన్నింటా ఈ సందడి కనిపిస్తోంది. ముందు ఈనెల 17లోగా బదిలీలన్నీ పూర్తి చేయాలనుకున్నా ఎప్పటిలాగే మార్పులు,
సిఫార్సుల లేఖలతో ప్రయత్నాలు ముమ్మరం
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం:
సాధారణ బదిలీలకు గడువు సమీపిస్తుండడంతో ఉద్యోగులు తమకు నచ్చిన చోటకు వెళ్లడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. విద్య, వైద్యారోగ్య శాఖలు మినహా మిగతా శాఖలన్నింటా ఈ సందడి కనిపిస్తోంది. ముందు ఈనెల 17లోగా బదిలీలన్నీ పూర్తి చేయాలనుకున్నా ఎప్పటిలాగే మార్పులు, చేర్పులు చేస్తూ గడువు తేదీని ఈనెల 30కి పొడిగించారు. దీంతో మొదటిదశలో ప్రయత్నాలు చేయాలని ఉద్యోగులు కూడా ఈసారి తమకు తెలిసిన మార్గాల్లో ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినా బదిలీల జాబితాను బయటపెట్టడం లేదు. కొద్దిరోజులుగా ఈ సంస్థలో పైరవీలు జోరందుకున్నాయి. విద్యుత్తు అధికారులకు కొన్ని ప్రాంతాల్లో పనులు తక్కువ.. వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాలకే ఎక్కువ మంది వెళ్లాలని కోరుకుంటారు. దీనికోసం ఓ సంఘ నాయకుడు కొంతమంది దగ్గర వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. కీలక ప్రాంతాలకు వెళ్లడానికి కొందరు ఉవ్విళ్లూరుతుంటే, మరికొందరు ఇతరత్రా కారణాలు చూపి ఉన్న స్థానం నుంచి కదలకుండా చూసుకుంటున్నారు. మిగతా శాఖల్లో మొదటి విడత తయారు చేసిన బదిలీల జాబితాల్లో గడువు ముగిసే నాటికి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ‘ఆర్డర్ టు సర్వ్’ పేరుతో కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులకు కూడా బదిలీలకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే బదిలీలు చేయాలన్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు తొమ్మిదేళ్ల వరకు ఉన్నచోటనే కదలకుండా ఉండే అవకాశం కల్పించడం గమనార్హం. జాబితాల్లో మార్పుచేర్పులు జరగడంపై ఉద్యోగుల్లో కాసింత ఉత్కంఠ నెలకొంది.
జడ్పీలో జోరు..
ఎంపీడీవోలు మొదలుకొని ఆఫీస్ సబార్డినేట్ వరకు బదిలీల కోసం నేతలతో సిఫార్సులు చేయించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో అయిదేళ్లు సర్వీసు పూర్తయిన ఎంపీడీవోలు ఒక్కరూ లేరు. కాకపోతే రిక్వెస్ట్ బదిలీలకు అవకాశం ఉండడంతో తమకు తెలిసిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కొందరు మండలాలు మారడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే జడ్పీ కార్యాలయం నుంచి ఎంపీడీవో కార్యాలయాలు, హైస్కూళ్ల వరకు పరిపాలనాధికారులు (ఏవో) 21 మంది, సీనియర్ అసిస్టెంట్లు 38, జూనియర్ అసిస్టెంట్లు 70 మంది, టైపిస్టులు 18 మంది.. మిగతా సిబ్బంది అంతా కలిపి 277 మంది అయిదేళ్ల సర్వీసు పూర్తయిన వాళ్లున్నారు. వీరిలో కొంతమంది ఇప్పటికే ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో, మరికొందరేమో సంఘ నేతలతో సొమ్ములు ముట్టజెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. జడ్పీ సీఈవో విజయ్కుమార్ వద్ద ప్రస్తావించగా పైరవీలకు ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టనున్నామని, సొమ్ములు వసూలు చేసినట్లు తమ దృష్టికి రాలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు