వచ్చే రెండేళ్ల పాలన మీ చేతుల్లోనే..
‘పార్టీలో గుర్తింపు లేదని ఎవరూ బాధపడొద్ధు ఈ రెండేళ్లు పాలనంతా మీ చేతుల మీదుగానే జరుగుతుంది. అందరూ కలిసి పనిచేస్తే గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధిస్తాం. పేటలో మళ్లీ వైకాపా జెండానే ఎగురుతుంద’ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు,
నేతలతో జిల్లా వైకాపా అధ్యక్షుడు ధర్మశ్రీ
కోటవురట్ల, న్యూస్టుడే: ‘పార్టీలో గుర్తింపు లేదని ఎవరూ బాధపడొద్ధు ఈ రెండేళ్లు పాలనంతా మీ చేతుల మీదుగానే జరుగుతుంది. అందరూ కలిసి పనిచేస్తే గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధిస్తాం. పేటలో మళ్లీ వైకాపా జెండానే ఎగురుతుంద’ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అధ్యక్షతన నియోజకవర్గ ప్లీనరీ కోటవురట్ల మండలం రామచంద్రాపురం శివారు అల్లుమియ్యపాలెం వెళ్లే దారిలోని శ్రీపతిరాజు మామిడి తోటలో శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా ధర్మశ్రీ మాట్లాడుతూ.. కష్టపడి పని చేసే వారికి ఇకపై గుర్తింపు ఉంటుందన్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమచేయడం ఇక ఉండదని, నాయకుల చేతుల మీదుగానే లబ్ధిదారులకు అందజేస్తారన్నారు. గతంలో ఏ పార్టీ చేయని విధంగా వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ నియోజకవర్గానికి రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడం జరిగిందన్నారు. నాయకులు, కార్యకర్తల మనోభావాలకు విలువిస్తూ వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ దృష్టిలో అందరూ సమానమేనని, బేధాభిప్రాయాలు లేకుండా అందరూ పనిచేయాలని సూచించారు. ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కోసం పార్లమెంటులో అడుగుతుండటం ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, కొన్నిచోట్ల పూర్తయ్యాయని చెప్పారు. ప్రతి కుటుంబంలో కలహాలుంటాయి. కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వడంతోపాటు నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి అందర్నీ కలుపుకొనిపోతే అన్నీ సర్దుకుంటాయని ఎస్.రాయవరం ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి సూచించారు. జిల్లా, నియోజకవర్గ పరిశీలకులు వెంకట్రావు, దిలీప్కుమార్, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్యనాయకులు ప్రసంగించారు. అనంతరం శ్రీపతిరాజును సన్మానించారు. వైకాపా రాష్ట్ర అదనపు కార్యదర్శి దత్తుడు సీతబాబురాజు, కోటవురట్ల జడ్పీటీసీ సభ్యురాలు ఉమాదేవి, పైల రమేష్, సర్పంచి చిన్న, నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
జెండా మోసిన వారికి గుర్తింపేదీ?
కోటవురట్ల, న్యూస్టుడే: ‘పార్టీ ఆవిర్భావం నుంచి జెండాలు మోస్తూనే ఉన్నాం. ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు విశ్రమించలేదు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పార్టీ కోసం కష్టపడిన వారికి ఏనాడైనా గుర్తింపు ఇచ్చారా?’ అని పలువురు నాయకులు గళమెత్తారు. వైకాపా ప్లీనరీలో పాయకరావుపేట జడ్పీటీసీ సభ్యుడు సూరిబాబు మాట్లాడుతూ.. 2024లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడి పనిచేయాలని చెబుతున్నారే తప్ఫ. ఒక్కరైనా కార్యకర్తల బాగోగులు గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. గ్రామ వాలంటీర్ల దగ్గరా విలువ లేకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోకి నిన్న, మొన్న వచ్చిన వారికి గుర్తింపు ఇస్తున్నారే తప్ఫ. మొదట్నుంచీ జెండాలు మోసిన వారి సంగతేంటని నక్కపల్లి మండల నాయకుడు వీసం రామకృష్ణ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక